నందమూరి నాటిసార్వభౌమ ఎన్టీఆర్ పేరు చెప్పగానే తెలుగు నాట పులకరించిపోతుంది. ఇప్పటికే ఎంతో మంది హృదయాల్లో ఆరాధ్య దైవంగా ముద్ర వేసుకున్న ఎన్టీఆర్.. ఎన్నో సినిమాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక సీనియర్ ఎన్టీఆర్, సావిత్రి జంటగా దేవత సినిమాలో నటించి మెప్పించారు. కాగా ఈ సినిమా షూటింగ్ టైంలోజరిగిన ఓ షాకింగ్ ఇన్సిడెంట్ తాజాగా రివిల్ అయింది. ఈ సినిమాలో కన్నుల మిసమిసలు.. సాంగ్ షూట్ కోసం మూవీ టీమ్ అంతా కలిసి సాతనూరుకు వెళ్లారట. ఆ టైంలో ఎన్టీఆర్, పద్మనాభం ఓ కారులో రాత్రి 9 గంటలకు మద్రాస్ నుంచి తిరువణ్ణమలై మీదగా సాతనూరు వెళ్లాల్సివచ్చింది.
ఈ క్రమంలో ఎన్టీఆర్ తనకు నిద్ర వస్తుందని.. తిరువణ్ణమలై రాగానే నన్ను నిద్ర లేపమని చెప్పి వెనుక సీట్లో నిద్రించారట. కాగా తిరువన్నమలై రాగానే పద్మనాభం ఎన్టీఆర్ను నిద్రలేపగా.. ఎన్టీఆర్ కారు దిగి కాసేపు తిరిగి తర్వాత వెళ్దాం పదండి బ్రదర్ అంటూ సంతనూరుకు తిరిగి బయలు దేరారట.ఇలా కారు వెళుతున్న టైం లో పద్మనాభం మాట్లాడుతూ.. అన్నగారు మీరు నిద్రపోతున్న టైంలో ఓ సంఘటన చోటు చేసుకుంది అది మీతో చెప్పాలి అన్నాడట. ఆ మాట విన్న ఎన్టీఆర్ ఏం జరిగింది బ్రదర్ అంటూ ప్రశ్నించారట. మీరు నిద్రపోతున్న టైంలో చంగల్పట్టు దగ్గరకు వెళ్లగానే ఓ పెద్దపులి కారుకు ఎదురు వచ్చిందని పద్మనాభం వివరించాడట.
ఆ మాట విన్న ఎన్టీఆర్ అరెరే.. నన్ను నిద్ర లేపాల్సింది కదా బ్రదర్. పులి ఎదురు రావడం శుభ సకునం అని కామెంట్స్ చేశారట. మీరు నిద్ర లేపవద్దని చెప్పడంతో లేపలేదు. ఆ పులి ఎదురు వస్తుంటే డ్రైవర్ గజగజ ఒణికిపోయారు.. నేను కూడా పైకి గంభీరంగా కనిపిస్తున్న లోపల ఒణుకు పుట్టిందంటూ పద్మనాభం చెప్పారట. అయితే ఎదురుగా పులి వస్తే మాకేం భయం లేదు.. మా వెనుక సింహం నిద్రపోతుంది అనే ధైర్యం ఉంది అంటూ పద్మనాభం.. ఎన్టీఆర్ తో అన్నారట. వెంటనే వెరీ గుడ్ బ్రదర్ అంటూ భుజంపై చేయి వేసి తట్టారని.. పద్మనాభం స్వయంగా వివరించారు.