టాలీవుడ్ నందమూరి నరసింహ బాలకృష్ణ.. తండ్రి ఎన్టీఆర్ నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్లు ఖాతాలో వేసుకున్న బాలయ్య.. ఆరుపదుల వయసులోనూ ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ నటనతో ఆకట్టుకుంటున్నాడు. అలా వరుసగా నాలుగు హిట్లు అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్లో అఖండ 2 సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటూ ఫ్యాన్స్ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ వయసులోనూ ఈ రేంజ్లో నటనతో ఆకట్టుకోవడం, డైలాగ్ డెలివరీతో గూస్బంప్స్ తెప్పించడం అంత సులువు కాదని.. బాలయ్య లాంటి నటుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండడం చాలా గొప్ప అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు.. బాలకృష్ణ ప్రయోగాత్మక సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలోనే కెరీర్ ప్రారంభంలోను ఆదిత్య 369, భైరవద్వీపం లాంటి సినిమాల్లో నటించి తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ తరంలోను బాలయ్య.. ఎంతోమంది కొత్త దర్శకులతో సైతం పని చేసి వాళ్లకు మంచి లైఫ్ను ప్రసాదించారు అనడంలో అతిశయోక్తి లేదు. కానీ.. ఆయన ఒక దర్శకుడికి మాత్రం సరైన కెరీర్ ఇవ్వలేకపోయాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు క్రిష్ జాగర్లమూడి.
వైవిద్యమైన కథలతో సినిమాలు తీస్తూ దర్శకుడుగా ఇమేజ్క్రియేట్ చేసుకున్న క్రిష్.. బాలయ్య వందవ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో సక్సెస్ అయినా తర్వాత.. బాలయ్య తండ్రి అయిన ఎన్టీఆర్ బయోపిక్ని చేయాలని ఉద్దేశంతో కథానాయకుడు, మహానాయకుడు సినిమాలను రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలు భారీ డిజాస్టర్లతో.. క్రిష్ కెరీర్ డైలమాలో పడిపోయింది. అప్పటినుంచి ఇప్పటికీ క్రిష్ కోలుకోలేకపోయారు. మరోసారి.. బాలకృష్ణ పిలిచి అతనికి ఇంకో అవకాశం ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందా.. లేదా అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే.. నిజంగానే ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా వీరిద్దరూ సినిమాను రూపొందిస్తారా.. లేదా.. అసలు వీళ్లిద్దరు కాంబోలో మూవీ ఉంటుందో.. లేదో.. తెలియాలంటే వేచి చూడాల్సిందే.