టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హృతిక్ రోషన్తో కలిసి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వార్2 తో ఆడియన్స్ను పలకరించనున్నాడు. అంతేకాదు ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ అడ్వెంచర్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్లో మొదటి నుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2000 కోట్ల పైన కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే సినిమా షూట్లో పాల్గొన్న తారక్.. యాక్షన్ ఎపిసోడ్లను శరవేగంగా పూర్తి చేస్తున్నాడని సమాచారం. ప్రశాంత్ నీల్ సైతం.. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడట. మొత్తానికి వీళ్ళిద్దరూ కలిసి సినిమా నెక్స్ట్ లెవెల్లో హిట్ చేయాలని కసితో ఉన్నారు. మరి ఈ ఇద్దరూ అనుకున్నట్లుగానే సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తుందా లేదా.. తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే. ఇలాంటి క్రమంలో సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట వైరల్గా మారుతుంది.
ఈ సినిమాల్లో ఒకప్పటి సీనియర్ స్టార్ హీరో ఎన్టీఆర్కు ఫాదర్గా కనిపించనున్నాడని టాక్. ఇక.. ఇంతకీ ఆ సీనియర్ స్టార్ హీరో ఎవరు కాదు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అని తెలుస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్, మోహన్ బాబు కాంబోలో.. రాజమౌళి యమదొంగ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వీళ్ళ కాంబో మళ్ళీ రిపీట్ కాలేదు. త్వరలోనే మళ్లీ ఇద్దరు కలిసి స్క్రీన్ పై కనిపించనున్నారని న్యూస్ ప్రస్తుతం వైరల్గా మారడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.