సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్గా సక్సెస్ సాధించిన తర్వాత వాళ్ళు నిర్మాతలుగా మారి సినిమాలను రూపొందించడం ఎప్పటినుంచో ఉంది. తాజాగా సమంత కూడా అదే బాటలో అడుగుపెట్టింది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించింది. నిర్మాతగా మారినా ఈ అమ్మడు.. శుభం సినిమాతో తన ప్రయత్నాన్ని ప్రారంభించి.. నిర్మాత గానీ కాదు.. కీలక పాత్రలోనూ నటించింది. ఇక నవీన్ కండ్రేగుల డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా.. నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ప్రీమియర్స్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ప్రేక్షకులను ఆకట్టుకుందా.. నిర్మాతగా సమంత సక్సెస్ అయిందో.. లేదో.. ఒకసారి చూద్దాం.
స్టోరీ:
భీమిలిపట్నం బ్యాక్ డ్రాప్లో కథ మొదలైంది. కేబుల్ టీవీ ఆపరేటర్ గా శ్రీను (హర్షిత్ రెడ్డి) తన ఇద్దరు స్నేహితులు (గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెర్రి) హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే విళ్ల ముగ్గురి భార్యలు శ్రీవల్లి, ఫరీదా, గాయత్రి (శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి)లు ముగ్గురు జన్మజన్మల బంధం సీరియల్ కు పూర్తిగా ఎడికెట్ అయిపోతారు. ఎంత పిచ్చి అంటే.. ఆ సమయంలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే వాళ్ళు దెయ్యాల ప్రవర్తిస్తూ ఉంటారు.. వాళ్ల ప్రాణాలు తీయడానికి సిద్ధపడిపోతారు.. ఈ క్రమంలోనే ముగ్గురు స్నేహితులు భార్యలు రాత్రి 9 గంటలకు వచ్చే సీరియల్కు అతుక్కుపోవడం.. కదిపితే దెయ్యాల మారిపోవడంతో ముగ్గురిలో భయం మొదలవుతుంది. తీరా.. ఆ ఊరిలో చాలామంది ఆడవాళ్లు ఆ సీరియల్ చూస్తూ ఇలానే ప్రవర్తిస్తూ ఉంటారు.
అలాంటి భార్యల పిచ్చి వల్ల ఈ ముగ్గురు స్నేహితులు బతుకు రివర్స్ అయిపోతుంది. ఈ క్రమంలోనే మాంత్రికురాలు మాయా మాత (సమంత) సలహా కోసం.. మగాళ్ళంతా ఆమెను ఆశ్రయిస్తారు. తమ భార్యలను బాగు చేసుకోవడంతో పాటు.. ఊరిలో ఆడవాళ్లను మామూలు మనుషులను చేయడానికి స్నేహితులు కష్టపడతారు. చివరకు వీళతో పాటు.. ఊరి ప్రజలకు శుభం జరిగిందా.. ఈ స్నేహితులు భార్యల నుంచి ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు.. తెలుగు సీరియల్ వాళ్ళ లైఫ్ ను ఎలా అశాంతికి గురిచేసింది.. మాయ మాతను ఆశ్రయిస్తే వాళ్లకు ఆమె ఇచ్చిన సలహా ఏమై ఉంటుంది.. మాయ మాత సలహాలు వాళ్ళకి ఎలా ఉపయోగపడ్డాయి.. ఇక శ్రీను టీమ్ కు డిష్ కుమార్ ఇచ్చిన షాక్ ఏమిటి..? వాడి పన్నాగాని ముగ్గురు స్నేహితులు ఎలా తిప్పి కొట్టారు.. గ్రామస్తులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఆ కష్టానికి ఈ స్నేహితులకు తీసుకువచ్చిన పరిష్కారం ఏంటి.. ఈ ప్రశ్నలకు ఫన్నీ, కామెడీ వేలో సమాధానాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
రివ్యూ:
సమంత నిర్మాతగా మారిన తర్వాత రూపొందిన ఈ సినిమా కొత్త కథ కాదు, గొప్ప సాంకేతికత జోడించుకున్నా.. అబ్బరు పరీక్ష స్టోరీ కాకున్నా.. ప్రతి ఒక్క మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు కనెక్ట్ అయ్యేలా ఉంది. నిత్యం మధ్య తరగతి కుటుంబాల్లో జరిగే చిన్న తమాషా సంఘటనలు.. దానివల్ల కాపురాలు, కుటుంబాల్లో వచ్చే అశాంతులను అత్యంత వినోదాత్మకంగా పంచే ప్రయత్నం చేసింది. ఈ సినిమా స్టోరీ రూపొందించిన విధానం పాత్రల డిజైనింగ్ మరోసారి డైరెక్టర్ ప్రతిభను రుజువు చేశాయి. సహజమైన విధానంలో ముగ్గురు దంపతుల క్యారెక్టర్లను మలిచిన ఆయన.. అలాంటి పాత్రలకు నటినట్టులను ఎంపిక చేసే విధానంలోనూ మంచి సక్సెస్ అందుకున్నారు. గత కొంతకాలంగా డైరెక్టర్ 80,90ల నాటి బ్యాగ్రౌండ్ కథలతో సినిమాలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి క్రమంలో ప్రవీణ్ కండ్రేగుల శుభం కథను 2004 బ్యాక్ డ్రాప్లో ప్లాన్ చేశాడు. అప్పట్లో కేబుల్ టీవీ ప్రతి ఇంట్లో ఉండేది. దానికి పోటీగా వచ్చిన డిటిహెచ్ ఎంట్రీతో.. కేబుల్ టీవీ ట్రెండ్ ఎలా మసకబారిపోయిందో అనే అంశాలను క్లియర్ గా చూపించారు. ముఖ్యంగా సినిమా బ్యాక్ డ్రాప్లో సంవత్సరం చూపించకపోయిన.. ఏడదిలో రిలీజ్ అయిన శంకర్ దాదా జిందాబాద్, గుడుంబా శంకర్, నువ్వు లేక నేను లేను సినిమాలను చూపించారు. కథ విషయంలో మహిళలు.. ముఖ్యంగా భర్తతో పాటు భార్యకు సమప్రదాయం ఇవ్వాలని అంశాలను జోడించారు.
దానికి ఓ టీవీ సీరియల్ ఎంచుకున్నారు. ఇక ఊళ్ళో 9:00కు వచ్చే సీరియల్ తో భార్యా,భర్తలు ఎలా విడిపోయారు.. భార్యలు దెయ్యం పట్టిన వాళ్ళల టీవీకి అతుక్కున్న సమయంలో.. డిస్టర్బ్ చేస్తే చేసే రభస.. ఆడియన్స్లో నవ్వులు పూయిస్తుంది. ఇల్లాలంటే వంటింటి కుందేలు కాదు.. వాళ్లకు తగిన గౌరవం ఇస్తూ.. ఆత్మ గౌరవాన్ని కాపాడాలని సందేశంతో సినిమాను రూపొందించారు. ఇక సాధారణంగా మహిళలు ఎప్పుడైనా.. ఏ విషయంలోనైనా శుభప్రదమైన ముగింపు ఉండాలని భావిస్తారు. అలా డైరెక్టర్ సినిమాను డిజైన్ చేశాడు. చక్కటి వినోదంతో తెరకెక్కించాడు.. మధ్య మధ్యలో ఆడియన్స్ను భయపెట్టే ప్రయత్నాలు చేశాడు. సినిమాలో మెయిన్ లైన్ ఇక్కడ రివీల్ చేయలేదు. అది స్క్రీన్ పై చూస్తేనే థ్రిల్ అవుతారు. ఇక మొత్తానికి సమంత ప్రొడ్యూసర్ గా మొదటి ప్రయత్నం మంచి ఉమెన్ ఓరియంటెడ్ మెసేజ్ తో రూపొందించింది.
నటీనటుల పర్ఫామెన్స్:
రెండు గంటల పాటు ఆడియోస్ కు ఎక్కడ బోర్ కొట్టకుండా.. స్క్రీన్కు అతుక్కుపోయేలా చేసారు. నవ్వించడమే కాదు.. కొన్ని సీన్లలో ఎమోషన్స్ని కూడా పండించారు. కుటుంబంలో మన చుట్టూ ఉండే ఫ్యామిలీ మెంబర్స్ని గుర్తు చేసేలా సినిమా తెరకెక్కింది. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెర్రి, శ్రీయ కొంటం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్ అందరి యాక్టింగ్ అదిరిపోయింది. అతిథి పాత్రలో కనిపించిన సమంత ఈ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్. మిగతా నటీనటులు తమ క్యారెక్టర్లకు తగిన న్యాయం చేస్తూ వచ్చారు.
టెక్నికల్ గా:
క్లింటన్ సెరోజ్ సాంగ్స్ సందర్భానికి తగ్గట్టుగా ఆకట్టుకున్నాయి. వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత హుందాతనాన్ని తెచ్చిపెట్టింది. మృదుల్ సినిమాటోగ్రఫీ.. నాచురల్ గా సీన్లను చూపించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎడిటర్ ధర్మేంద్ర కాకరాల.. కత్తెరకు పర్ఫెక్ట్గా పని చెప్పారు. ట్రలాలా బ్యానర్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. నిర్మాతగా ఈ సినిమాతో సమంత నిరూపించుకుంది. మరోసారి నటిగానే కాదు.. నిర్మాతగాను సినిమాపై ఉన్న ప్రేమ ఏంటో అందరికీ తెలిసేలా చేసింది.
ప్లస్ లు మైనస్ లు:
జన్మజన్మల బంధం అంటూ టెలివిజన్ సీరియల్ కథను వాడుకున్న తీరు సినిమాకు ప్లస్ అయింది. ఫస్ట్ హాఫ్ లో సమస్యను ఎస్టాబ్లిష్ చేసిన తీరు.. పాత్రలు పరిచయం, యాటిట్యూడ్, బిహేవియర్ డిజైన్ చేసిన తీరు ఆడియన్స్ సినిమాలో లీనమయ్యేలా చేశాయి. ఫస్ట్ హఫ్ కథను సక్సెస్ ట్రాక్లో నడిపించిన ప్రవీణ్.. సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం తడబడినట్లు అనిపించింది. ఆ లోపాలను కప్పిపుచ్చడానికి.. సినిమా బండి టీంను.. ప్రాజెక్టు లోకి లాగి చాలా కష్టపడ్డాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
డైరెక్షన్ ఆకట్టుకుంది. బ్యాగ్రౌండ్స్ స్కోర్ అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ అప్పటి కాలానికి ప్రతిబింబించేలా డిజైన్ చేశాడు. మొత్తం మీద నటీనటుల పర్ఫామెన్స్, టెక్నికల్ టీం కష్టం సినిమాకు హైలైట్. సెకండ్ హాఫ్ లో కథ సాగదిత.. స్క్రిప్ట్ లో గందరగోళం తప్పించి.. మిగతా విషయాలన్నీ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో సాగే ఎంటర్టైనింగ్ మూవీ. లాజిక్కులు లేకుండా.. అంచనాలు లేకుండా.. సినిమాకు వెళ్తే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు.
రేటింగ్: 3.50