పహల్గామ్ దాడి తర్వాత భారత్ ప్రతీకారంతో రగిలిపోయింది. ఈ క్రమంలోని పది రోజులు సమయం తీసుకున్న మోదీ.. ఆర్మీకి ఫుల్ పవర్ ఇచ్చేసాడు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పై భారత్ యుద్ధం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ల వార్ జోరుగా సాగుతుంది. అనవసరంగా ఇండియాను గెలికి.. పాకిస్తాన్ తప్పు చేసింది. ఈ క్రమంలోనే భారత్ ఆర్మి పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తుంది. అయితే తాజాగా జమ్మూపై దాడి చేసే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. ఆ ప్రయత్నాన్ని ఇండియన్ ఆర్మీ తిప్పి కొట్టారు.
ఈ నేపథ్యంలో వెంటనే వరుసగా పాకిస్తాన్ పై భారత్ ఎదురుదాడులు చేయడం ప్రారంభించారు. అలా.. పాకిస్తాన్లోని కీలకమైన ఇస్లామాబాద్, లాహోరి ప్రాంతాల్లో భారీ పేలుళ్లు చేసి ఇండియన్ ఆర్మీ సత్తా చూపించారు. అటు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఇంటికి సమీపంలోనూ భారీ పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుడు ఆయన ఇంటికి 10 కిలోమీటర్ల పరిధిలో జరిగింది. ఈ దెబ్బకు ఇండియా మెరుపు దాడికి పాక్ మెండ్ బ్లాక్ అయ్యింది. ఈ ఎదురుదాడులు తట్టుకోలేక.. పాకిస్తాన్ ఆర్మీ చేతులెత్తేసింది.
ఇండియన్ దాడులను తట్టుకోలేమని చాలామంది పాకిస్తాన్ అధికారులు సైతం.. దేశంవదిలి పారిపోతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్.. ఇప్పుడు పాక్తో సంబంధం లేదని బెహరన్కు పారిపోతున్నట్లు సమాచారం. ఆయనతో పాటు మరికొంతమంది పాకిస్థాన్ ఆర్మీ ఆఫీసర్లు కూడా ప్రత్యేక విమానాల్లో వెళుతున్నట్లు ప్రాథమిక సమాచారం. వీళ్ళందరూ లాహోర్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో బెహరాన్ కు వెళ్ళిపోతున్నారట.