పహల్గాం ఉగ్ర దాడితో భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అనవసరంగా భారత్ను టచ్ చేసిన పాకిస్తాన్కు ఇండియన్ ఆర్మీ చుక్కలు చూపిస్తుంది. పాకిస్తాన్ దాడులను అంతే స్పూర్తతి తిప్పి కొడుతుంది. తాజాగా ఈ ఉగ్రదాడల పరంపరలో.. మరో ఘట్టం జమ్ము ప్రాంతాన్ని టార్గెట్ చేసిన పాకిస్తాన్. ఎనిమిది క్షిపణులను ప్రయోగించింది. సత్వరి, సాంబ, ఆర్ఎస్, పురనీయ ప్రాంతాల్లో జరిగిన ఈ దాడులను భారత్ నావి బలంగా అడ్డుకుంది. పాకిస్తాన్ ప్లాన్ పూర్తిగా ప్లాప్ అయింది. ఇక ఈ దాడుల తర్వాత భారత్ నావి.. వెల్లడించిన అంశాలు ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతున్నాయి. పాక్ సైన్యం హామాస్ ఉగ్రవాద సంస్థల మాదిరిగానే అతి తక్కువ ఖర్చుతో తయారయ్యే రాకెట్లు, డ్రోన్లను ఉపయోగించి చిన్న స్థాయి దాడులకు పాల్పడుతున్నారని వివరించారు.
దీన్ని చూస్తేనే పాకిస్తాన్ ఆర్మీ ఎంత దారుణ పరిస్థితిలో ఉందో అర్థమవుతుంది. ఉగ్రవాద సంస్థలు ఉపయోగించే చీప్ ఆయుధాలను పాకిస్తాన్ వాడుతోంది. పాకిస్తాన్ చేసిన భారీ కుట్రను భారత సైన్యం ఒక్క దెబ్బతో తిప్పికొట్టింది పాకిస్తాన్ 15 భారత్ నగరాలపై డ్రోన్ లు, క్షిపణులతో దాడి చేసి నేలమట్టం చేయాలని ప్లాన్ చేస్తే.. భారత్ ఎస్400 డిఫెన్స్ సిస్టం సహాయంతో.. ఒక్కసారిగా ఆ 15 క్షిపణులపై అటాక్ చేసింది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం భారత సైన్యం పాకిస్తాన్, లాహోర్ నగరంలో హెచ్ క్యూ9 (మేడ్ ఇన్ చైనా) ఎయిర్ డిఫెన్స్ సిస్టం ధ్వంసం చేసింది. ఇక చైనా అభివృద్ధి చేసిన ఈ అధునిక యంత్రం.. 120 నుంచి 250 కిలోమీటర్ల పరిధిలో ఏకకాలంలో అనేక లక్ష్యాలను గుర్తించి చేదించగలరని చైనా గొప్పగా ప్రచారం చేసుకుంది. కానీ.. భారత డ్రోన్ దాడికి అది నిమిషాల్లో నేలమట్టమయింది.
indian s – 400 diffence system
చైనా వ్యవస్థ పై నమ్మకాన్ని దిగజార్చింది. పాక్కు ముఖ్యమైన నగరాలైన కరాచీ, లాహోర్, రావాల్పిండి, ఓదార్ లాంటి ప్రాంతాల్లో హెచ్ క్యూ9 వ్యవస్థను మోహరిస్తూ వచ్చిన పాక్కు ఇది చాలా పెద్ద దెబ్బ. కేవలం హెచ్ క్యూ లైన్ ద్వంసం.. పాకిస్తాన్ మిలటరీకే కాదు.. చైనా ఆయుధాల నాణ్యత పై అంతర్జాతీయ నమ్మకాన్ని కోల్పోవడం కూడా. చైనా తయారీ ఆయుధాలను కొనుగోలు చేస్తున్న ఎన్నో దేశాలకు ఇది పెద్ద వార్నింగ్ గా మారింది. సాంకేతిక విశ్వాస నియతతో తక్కువ స్థాయిలో ఉన్న ఈ చైనా ఆయుధాలు.. అత్యవసర సమయాల్లో ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మరోసారి ప్రూవ్ అయింది. ఈ క్రమంలోనే ఎప్పుడు పనిచేస్తయో.. ఎప్పుడు పని చేయవో తెలియని చైనా వాడి ఆయుధాలను వాడిన పాకిస్తాన్కు పెద్దదెబ్బ పడింది.