పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించి పలు పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ధ్వంసం చేసింది. ఇండియన్ నేవీ సత్తా చాటుకుంది. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్యయుద్ధ వాతావరణ మొదలైంది. గురువారం పాకిస్తాన్ భారతదేశంలోని కొన్ని నావి స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగింది. అయితే.. ఆ ప్రయత్నం విఫలమైంది. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం ఇస్లామాబాద్, లాహోర్లపై బాంబు దాడి జరిగిందని సమాచారం. ఇక ఈ ఇండో, పాక్ వార్.. శుక్ర,శనీ, రాహువుల కలయిక మధ్యలో ప్రారంభమైందట. ఉజ్జయిని జ్యోతిష్యుడు పండిట్ నళిన్ శర్మ జ్యోతిష్య విశ్లేషణలో ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు.
నళిన్ శర్మ మాట్లాడుతూ.. POK.. భారత్ విలీనం పై మాట్లాడుతూ.. ప్రస్తుతం శుక్రుడు తన ఉత్సరాశి మీనంలో.. శని, రాహువులతో కలిసి ఉన్నాడని.. గ్రహాలలో ఈ స్థానం ఇండో – పాక్ వార్ ఎంతో కాలం కొనసాగదని సూచిస్తుంది అంటూ వివరించాడు. త్వరలోనే పాకిస్తాన్.. భారత్కు లొంగిపోవడం ఖాయమని.. అలా జరగకపోతే పాకిస్తాన్కే నష్టం వాటిల్లుతుందంటూ వివరించాడు. పిఓపి భారత్లో విలీనం అవుతుందని.. అయితే భారత్కు కూడా ఈ పరిస్థితి కొంత ఆందోళన కల్పిస్తుంది అంటూ పేర్కొన్నారు. అయినా.. గ్రహాలు కలయికతో భారత్ పరాక్రమం పెరగనుందని సూచించారు.
ప్రధాని నరేంద్ర మోడీ జాతకం రీత్యా.. పంచమ భాగంలో రాహువు ఉన్నాడని.. దీని కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. కానీ ఖచ్చితంగా అంతిమ విజయం చేకూరుతుందంటూ వివరించారు. ఆయన రాశి వృశ్చిక రాశికి అధిపతి అయిన కుజుడు. నవగ్రహాల్లో సైన్యాధిపతిగా పిలవబడుతున్నాడు అంటూ పేర్కొన్నారు. ప్రధాని మోడీ జాతకంలో 2028 వరకు దీన్ని ప్రభావం ఉంటుందని.. లగ్నాధిపతి అయిన కుజుడు స్వయంగా యుద్ధకారకుడు కనుక.. ఈ యుద్ధం తర్వాత ప్రధాని మోడీ స్థాయి మరింతగా పెరగబోతుందంటూ వివరించాడు. సూర్యుడు, కేతువు కలయికను బట్టి చూస్తే మూడో దేశం జోక్యంతో యుద్ధం మరింత కాలం కొనసాగుతుందని.. లేదంటే ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసిపోతుంది అంటూ వివరించాడు ఆస్ట్రాలజర్ నళిన్ శర్మ.