పహల్గమ్ దాడి తర్వాత పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేస్తూ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధుర్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా ఒకేసారి.. ఎనిమిది ఉగ్ర స్థావరాలపై భారత్ నావి దాడి చేసి ఉగ్రవాదులను అంతం చేశారు. దట్ ఇస్ ఇండియన్ ఆర్మీ అనేలా సత్తా చాటుకున్నారు. అయితే.. భారత ఆర్మీకి మద్దతుగా మొత్తం భారతదేశమంతా సెల్యూట్ చేస్తూ ఇండియన్ నేవీ పై ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సింధూర విషయంలో తమ వంతుగా మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. అంతేకాదు.. టాలీవుడ్ నటీనటులు సైతం తమ వంతుగా సైన్యానికి సెల్యూట్ చేస్తూ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోల తీరు వివాదాలకు తావిచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోలుగా రాణిస్తున్న ఖాన్ త్రయం.. షారుఖ్, సల్మాన్, అమీర్లు కనీసం మద్దతుగా ఒక్క ట్విట్ కూడా వేయకపోవడంతో.. పెద్ద దుమారమే రేపుతుంది. వీళ్ళు ఉంటున్న దేశం పట్ల.. భారత నావి పట్ల.. ఉన్న గౌరవం ఏంటో అర్థమవుతుందంటూ నేటిజెన్లు మండిపడుతున్నారు. అంతేకాదు.. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ క్రేజ్తో దూసుకుపోతున్న నటుడు సైఫ్ అలీ ఖాన్ సైతం.. ఆపరేషన్ సింధూర్కు ఎలాంటి మద్దతు పలకలేదు.
అయితే.. ఈ స్టార్ హీరోలంతా బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నప్పుడు మాత్రం.. కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటూ.. వాటిని తమ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి.. తెగ ప్రమోషన్స్ చేసేస్తారు. కానీ.. ఇంత స్టార్డం, ఫ్యాన్ ఫాలోయింగ్.. ఇంతగా ఇండియన్స్ ఆదరిస్తున్న దేశ ప్రజల పట్ల కనీసం గౌరవం లేదు సరికదా.. దేశంపై, ఆర్మీ పై కూడా గౌరవం లేదంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అయినా ఇదేమీ పట్టనట్లు నోరు మెదపకుండా మొండిగా ఖాన్స్ ప్రవర్తిస్తున్నారు.