పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యను ప్రారంభించిన భారత్.. కేవలం 25 నిమిషాల్లోనే 9 పాకిస్తాన్ ఉగ్రస్తావురాలపై 24 క్షిపణులతో దాడి చేసి నేలమట్టం చేసింది. ఇక ఈ దాడిలో వంద మంది ఉగ్రవాదులు మరణించారు. ఈ క్రమంలోనే పాక్ భారత్ పై ప్రతికార చర్యకు దిగింది. అదే సమయంలో భారత్ సుదర్శన చక్రం పాక్ ఆటలకు చెక్ పెట్టింది. ఎస్.. ఆపరేషన్ సింధూర తర్వాత పాకిస్తాన్ ప్రతికార చర్యలో భాగంగా వైమానిక క్షిపణి, డ్రోన్ల దాడులకు దిగిన క్రమంలో.. గురువారం ఉదయం భారత్లోని 15 నగరాల్లో సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లను పాక్ ప్రయోగించింది. అంతేకాదు.. జమ్మూ లక్ష్యంగా మరిన్ని డ్రోన్లు, మిస్సైళ్లు, ఫైటర్ జెట్లను వదిలింది.
అయితే.. వాటనింటిని భారత్ మరో ఆలోచన లేకుండా తిప్పి కొట్టింది. దానికి భారత సైన్యానికి పూర్తిగా సహకరించిన రక్షణ వ్యవస్థలో.. సుదర్శన చక్రం (ఎస్ 400) డిఫెన్స్ సిస్టం కీలక పాత్ర పోషించింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థలను భారత్ నాశనం చేయగలిగిందంటే దానికి ప్రధాన కారణం వాళ్ళ వద్ద ఇలాంటి రక్షణ వ్యవస్థలు లేకపోవడమే. ఈ ఎస్ 400.. రష్యాకు చెందిన ఎస్పిఓ అల్మాస్ సంస్థ ఆధునికరించింది. దీన్ని సంచారక్ష పని వ్యవస్థ అంటారు. ఇక 2018లో వీటిని ఐదు కొనుగోలు చేసింది భారత్. దీనికోసం రష్యాతో రూ.543 కోట్ల డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకోవడం విశేషం.
ఇందులో మూడు వ్యవస్థలు ఇప్పటికే భారత్కు చేరగా.. మిగిలిన రెండు వ్యవస్థలు వచ్చేయడది ఆగస్టులో ఇక్కడికి చేరుకొనున్నాయని అంటున్నారు. డ్రోన్లు, యుద్ధ విమానాలు, బాలిస్టిక్ క్షిపణులను అత్యంత కచ్చితత్వంతో ఇది కుప్పకూలుస్తుంది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు పాక్ భారతదేశం పై మరో 50 డ్రోన్లు, ఎనిమిది మిస్సయిళ్ళు, 3 ఫైటర్ జట్లను ప్రయోగించగా వాటన్నింటిని సమర్థవంతంగా ఎస్ 400 నాశనం చేసింద. ఈ స్థాయి వ్యవస్థ భారత్కు రావడంలో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ కీలకపాత్ర వహించారని అంటున్నారు. నాడు ఈ వ్యవస్థలు ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్కు అవసరమని ప్రధాని మోడీకి.. పారీకర్ నొక్కి చెప్పారట. ఈ క్రమంలోనే రష్యాతో ఒప్పందం కుదుర్చుకొని వాటిని ఇండియాకు రప్పించారు.