టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో ఎస్ఎస్ఎంబి 29 ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి పాన్ వరల్డ్ మార్కెట్ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో అడ్వెంచర్స్ థ్రిల్లర్గా రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలోనే నేషనల్ లెవెల్ ఆడియన్స్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటిగా రూపొందుతున్న ఈ సినిమాతో మరోసారి తనను తాను ప్రూఫ్ చేసుకోవాలనే కసితో ఉన్నాడు జక్కన్న. ఇక ఇలాంటి జానర్లో ఓ కథ రూపొందించడం.. అది కూడా ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేలా ప్రతి సన్నివేశాన్ని తీయడం అంటే అది చాలా కష్టతరమైన విషయం.
ఈ క్రమంలోనే రాజమౌళి.. తన గత ప్రాజెక్టులతో పోలిస్తే ఈ సినిమాపై మరింత శ్రద్ధ చూపిస్తున్నాడని.. ఫుల్ కాన్ఫిడెంట్ తో ఈ సినిమా రూపొందిస్తున్నాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇదిలా ఉంటే సినిమాపై ప్రెసెంట్ మరో క్రేజీ అప్డేట్ వైరల్ గా మారుతుంది. రాజమౌళి గురువైన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటింపజేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట. మహేష్ బాబుని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా రాఘవేందర్ర రావే కావడం విశేషం.
ఈ క్రమంలోనే జక్కన్న.. రాఘవేందర్రావుని డైరెక్ట్ చేయడం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఫీల్ అవుతున్నాడని తెలుస్తుంది. ఇంతకీ రాఘవేంద్ర నటించిన ఆ పాత్ర ఏంటి.. స్క్రీన్ టైమ్ ఎంత అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది. కాగా ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఆడియన్స్ లో మాత్రం రాఘవేంద్రరావు రోల్ పై మరింత ఆసక్తి నెలకొంది. వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే అఫిషియల్ గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.