స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోయిన్గా నెంబర్ వన్ పొజిషన్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు నిర్మాతగాను అమ్మడు రాణిస్తోంది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత.. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు బాలీవుడ్ వెబ్ సిరీస్లలో నటిస్తున్న ఈ అమ్మడు టాలీవుడ్ సినిమాలకు నిర్మాతగా మారింది. తాజాగా.. ఈ అమ్మడు రూపొందించిన శుభం సినిమా ఈ నెల 9న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం సినిమా నుంచి టీజర్ రిలీజై ఆడియన్స్ను ఆకట్టుకుంది.
ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన ఆరోగ్య విషయాలు, ఎక్సర్సైజ్ వీడియోలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నా సమంతా.. ఇటీవల ప్రొడక్షన్ బ్యానర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాను నిర్మించిన శుభం సినిమాలో స్పెషల్ పాత్రలోను మెరిసింది. కాగా.. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. రిస్క్ తీసుకోకుండా సినిమాల్లో కంప్లీట్ మార్పును ఆశించలేము. నేను ఎప్పుడు రిస్క్ తీసుకోవడం నుంచి వెనక్కి తగ్గును. ఇప్పటివరకు తగ్గలేదని అనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది.
చాలా వరకు కష్టాలు చూసా.. దాదాపు 15 సంవత్సరాలుగా నటిగా నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నా. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న కథలపై నమ్మకంగా ఉండడానికి అవసరమైన అంతరదృష్టి అనుభవాన్ని పొందానని నేను భావిస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది సమంత. ఇక తన సొంత నిర్మాణ బ్యానర్ ట్రలాల మూవింగ్ పిక్చర్ గురించి ఆమె మాట్లాడుతూ.. ఇందులో ఎంతో అద్భుతమైన టీం తనకు ఎంతగానో కోపరేట్ చేశారంటూ వివరించింది. అలాగే మేము ఒకరినొకరు పూర్తిగా ఆదరిస్తామని నమ్మకం మాకు ఉందంటూ వివరించింది. ఎప్పుడు తటస్థంగా లేదా.. అర్ధహృదయంతో లేని రచనలను రిలీజ్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా కట్టుబడి ఉన్నాం అంటూ చెప్పుకొచ్చింది.