టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజమౌళి డైరెక్షన్లో భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్లోనే 29వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాను.. ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్ తో సెట్స్ పైకి తీసుకోవచ్చారు. ఇక సినిమాల్లో ప్రియాంక చోప్రా హీరోయిన్గా, పృథ్వి రాజ్ సుకుమారన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే వీళ్లకు సంబంధించిన పలు ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
ఇక అటు జక్కన్న తో పాటు.. ఇటు మహేష్ కెరీర్లోనే ఈ మూవీ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ నెటింట వైరల్గా మారుతున్నాయి. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
అసలు మేటర్ ఏంటంటే.. ప్రస్తుతం శరవేగంగా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా.. ఇప్పటికే మూడు షెడ్యూల్ పూర్తి చేసింది. ఇలాంటి క్రమంలో రాజమౌళి సినిమా షూట్కు లాంగ్ బ్రేక్ ఇచ్చాడని సమాచారం. ఏకంగా 40 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ ఆగిపోనుందట. వేసవి తీవ్రత ఎక్కువ కావడంతో.. సినిమా యూనిటీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ బ్రేక్ లో మహేష్ తన కుటుంబంతో కలిసి ఫారెన్ ట్రిప్లు.. వెకేషన్లు ఫ్లాన్ చేస్తునట్లు సమాచారం.