టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రూపొందిస్తున్న మూవీ ఎస్ఎస్ఎంబి 29. మహేష్ బాబు హీరోగా రూపొందిస్తున్న ఈ సినిమా.. పాన్ వరల్డ్ రేంజ్లో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్లో రూపొందుతుంది. కే.ఎల్. నారాయణ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. సెట్స్పైకి రాకముందే ఆడియన్స్లో భారీ అంచనాలను నెలకొల్పింది. ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సినిమాల లిస్టులో మొదటి వరుసలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి.. శరవేగంగా పలు షెడ్యూల్లను పూర్తి చేసిన టీం.. ఇప్పుడు షూట్కు కాస్త బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాతో పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ను టార్గెట్ చేశాడు జక్కన్న.
ఈ క్రమంలోనే మహేష్ అభిమానులే కాదు.. పాన్ వరల్డ్ రేంజ్లో రాజమౌళి ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా సినిమా బాక్సాఫీస్ షేక్ చేస్తుందంటూ.. సంచలనాలు సృష్టించడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఎలాగైనా పూర్తి చేసి రిలీజ్ చేయడానికి మరో రెండేళ్లు ఈజీగా అవుతుంది. ఈ సినిమా తర్వాత మహేష్ తన నెక్స్ట్ సినిమాను ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఇలాంటి క్రమంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ గా మారుతుంది. మహేష్ ఎస్ఎస్ఎంబి29 తర్వాత పెద్ది సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు సన్నాతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ టాక్.
గతంలో బుచ్చిబాబును కలిసిన మహేష్.. ఏదైనా కథ ఉంటే చేసేద్దామని మాట ఇచ్చాడట. ఈ క్రమంలోనే ప్రస్తుతం చరణ్తో కలిసి పెద్ది సినిమా రూపొందిస్తున్న బుచ్చిబాబు.. తర్వాత మహేష్ను లైన్లో పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడని సినీ వర్గాలలో టాక్ వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారడంతో.. వామ్మో బుచ్చిబాబు రేంజ్ మారిపోయిందిగా.. ఉప్పెన ఒక్క హిట్తో చరణ్, మహేష్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ హీరోలను బుట్టలో పడేస్తున్నాడే అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆయనతో ఓ సినిమా వస్తే మాత్రం బుచ్చిబాబు దశ తిరిగిపోతుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.