సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఒకసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక.. ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా మారిపోతుందో.. ఎవరు స్టార్ట్డంతో రాణిస్తారో.. ఎవరు సక్సెస్ అందక ఫేడౌట్ అయిపోతారో.. ఎవరు చెప్పలేరు. ఈ క్రమంలోనే సక్సెస్ వెంట మాత్రం ఇండస్ట్రీ పరుగులు తీస్తూ ఉంటుంది. టాలెంటెడ్ ఆర్టిస్టుల కన్నా.. సక్సెస్లు అందుకుంటున్న స్టార్ సెలబ్రిటీస్కే ఇండస్ట్రీలో ఎక్కువగా అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇక హిట్ లేకుండా మరోసారి సినిమాలో అవకాశం దక్కించుకోవడం అంటే అది కత్తి మీద సామే అవుతుంది. దాన్ని స్వీకరించడం కూడా చాలా కష్టం. ఒకవేళ అవకాశం వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది.
అయితే.. భాగ్యశ్రీ బోర్సేకు మాత్రం ఇదంతా పూర్తి రివర్స్. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఫ్లాప్స్ ఉన్నా సరే.. అవకాశాలు వచ్చేస్తాయని ఈ అమ్మడు నిరూపించింది. రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే.. ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. రవితేజ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్గా ఈ సినిమా నిలిచింది. ఇలాంటి క్రమంలో రిజల్ట్తో సంబంధం లేకుండా.. భాగ్యశ్రీ వరుస సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న కాంత సినిమాలో నటిస్తోంది. మరోపక్క విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాలోను ఈ అమ్మడు మెరువనున్న సంగతి తెలిసిందే.
ఇలా దుల్కర్, విజయ్లకు జంటగా భాగ్యశ్రీ నటిస్తున్న ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలు ఇంకా రిలీజ్ కూడా కాకముందే ఎనర్జిటిక్ స్టార్ రామ్ 22వ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. ఈ మూడు సినిమాలు సక్సెస్ అయితే మాత్రం అమ్మడి వేగానికి అడ్డుకట్ట వేయడం కష్టమే. కెరీర్లో ఒక్క హిట్ కూడా లేకుండానే ఈ రేంజ్ లో స్టార్ హీరోల సినిమాలు అవకాశాలు కొట్టేసిందంటే.. అమ్మడి క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎంతోమంది హిట్లు ఉన్న స్టార్ హీరోయిన్స్ సైతం ఒక్క ఛాన్స్ అంటూ ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తున్న ఛాన్సులు రాని క్రమంలో.. భాగ్యశ్రీ కి మాత్రం ఒక హిట్ లేకున్నా వెతుక్కుంటూ మరీ అవకాశాలు వస్తున్నాయి.