టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని నుంచి 2019లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్గా నిలిచిన జెర్సీ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆయన కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన ఈ సినిమాకు.. గౌతం తిన్ననూరి డైరెక్టర్గా వ్యవహరించారు. ఈ సినిమా ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు.. విమర్శకులతో సైతం ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఇదే సినిమాను 2022లో హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన సక్సెస్ అందుకోలేకపోయింది.
ఇటీవల హిట్ ది థర్డ్ కేస్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నాని ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ బాలీవుడ్ రిజల్ట్ పై రియాక్ట్ అయ్యారు. అప్పుడు కోవిడ్ అయింది. జనం బయటకు అప్పుడప్పుడే వస్తున్నారు. అప్పటికి లాక్డౌన్ సమయంలో.. ఇంట్లోనే మంచి మంచి కంటెంట్, మసాలా, ఎనర్జిటిక్ సినిమాలను చూడడం అలవాటు పడిపోయారు. జెర్సీ ఒక గొప్ప మూవీ. కానీ.. ఇది ఎమోషనల్ కంటెంట్. హిందీలో కూడా అంతే గొప్పగా ఉంది. కానీ.. ప్రేక్షకులు మూడు మారిపోవడంతో రిజల్ట్ చేంజ్ అయింది.
ఎంత గొప్ప నటుడు కానీ.. సినిమా రిలీజ్కు టైమింగ్ కూడా ముఖ్యం అంటూ నాని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన అదే టైంలో కేజిఎఫ్ లాంటి హై ఎనర్జిటిక్ సినిమా వచ్చింది అంటూ నాని చెప్పుకొచ్చాడు. ఈ కారణంగానే జెర్సీ అలాంటి రిజల్ట్ అందుకుంది అంటూ వివరించాడు. ఇక ఈ హిందీ రీమేక్ ను నాగ వంశీ ప్రొడ్యూస్ చేయగా.. అనిరుధ్ సంగీతం అందించారు. దాదాపు రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా తీవ్ర నిరాశకు గురిచేసింది.