పహల్గాం ఉగ్రదాడిపై కోపంతో ప్రతి కారంతో రగిలిపోయిన భారత్.. పాకపై తాజాగా విరుచుకుపడింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్లోని 9 ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ ప్లాన్ చేసి విజయవంతంగా సక్సెస్ చేశారు భారత ఆర్మీ. ఈ విషయాన్ని వాళ్లే అఫీషియల్ గా ప్రకటించారు. ఇక ఈ ఆపరేషన్తో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇక ఈ ఆపరేషన్కు పెట్టిన పేరుతోనే పాక్కు.. భారత్ బలమైన మెసేజ్ ఇచ్చింది. పహల్గాం దాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకార చిహ్నంగా ఆపరేషన్ సింధూర్ పేరును ఉపయోగించారు.
అలాగే యోధులకు పెట్టే వీర తిలకం అనే అర్థం కూడా ఇందులో కనబరిచారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ సిందూర్ పై ఎన్నో రంగాలకు చెందిన ప్రముఖుల అంత రియాక్ట్ అవుతూ వస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆపరేషన్ సింధుపై హర్షం వ్యక్తం చేస్తూ.. భారత్ మాతాకీ జై, జై హింద్ అంటూ ట్విట్లు మారుమోగిపోతున్నాయి. ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా.. తన ట్విట్టర్ వేదికగా ఆపరేషన్ సింధూర్పై రియాక్ట్ అవుతూ.. మా ప్రార్థనలన్నీ భద్రత బలగాలతోనే ఉంటాయి. ఒక దేశం.. కలిసి నిలబడదాం అంటూ ట్విట్ చేశారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి జై హింద్ ట్విట్ తో.. ఆపరేషన్ సింధూర్ ఫోటోను షేర్ చేసుకున్నారు. రితేష్ దేశ్ముఖ్.. జై హింద్ సేన.. భారత్ మాతాకీ జై అంటూ ట్విట్ చేశారు. ఖుష్బు.. న్యాయం జరిగింది.. భారత్ మాతాకి జై అంటూ పుర్కొన్నారు. మధుర్ బండార్కర్.. భద్రత దళాలకు మరింత బలం చేకూరాలని ప్రార్థిద్దాం.. ఒకే దేశం కలిసి నిలబడదాం.. వందేమాతరం అంటూ ట్విట్ చేశారు. ప్రస్తుతం ఈ సెలబ్రిటీ ట్విట్ లు తెగ వైరల్ గా మారుతున్నాయి.