ముగ్గురు స్టార్ హీరోయిన్‌ల‌తో తారక్ రొమాన్స్.. ఫ్యాన్స్‌కు పండగే..!

టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే చివరగా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ జాన్వి కపూర్ హీరోయిన్గా నటించనున్న‌ సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ నెక్స్ట్ టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్.. డ్రాగెన్‌. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై శ‌ర‌వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

Hari K on X: "Shruti Haasan is being considered for a special dance  performance alongside NTR in NTRNeel... Rukmini Vasanth is the leading lady  in the film... #NTR #RukminiVasanth #ShrutiHaasan #PrashanthNeel #NTRNeel

ఇక ఈ సినిమాలో హీరోయిన్లకు సంబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కాగా ఇప్పటికే ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న హీరోయిన్‌గా రుక్మినీ వసంత్ కనిపించ‌నుంద‌ని.. వీరిద్దరి కెమిస్ట్రీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి క్రమంలోనే ఆమెతో పాటు మరో హీరోయిన్స్ శృతిహాసన్ కూడా.. ఎన్టీఆర్ కు జంటగా కనిపించనుంద‌ని.. స్పెషల్ సాంగ్ లో ఇద్దరు కలిసి చిందేయనున్నారు అంటూ టాక్‌ నడిచింది.

Mamitha Baiju - Wikipedia

ఇప్పుడు మూడో హీరోయిన్గా డ్రాగన్ మూవీలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు కూడా కనిపించనుందంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. ఆ ముగ్గురితో కలిసి తారక్ డ్రాగన్ మూవీ లో రొమాన్స్ చేయనున్నాడు. ఈ క్రమంలోనే వీరికి సంబంధించి న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. ఇక‌ ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియాలంటే మూవీ టీమ్ అఫిషియ‌ల్‌గా వివరించే వరకు వేచి చూడాల్సిందే.