సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సత్తా చాటుకున్న తర్వాత.. నార్త్ లోను ఇండస్ట్రీని షేక్ చేసిన నంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే మొదట శ్రీదేవి పేరే వినిపిస్తుంది. ఇండియన్ సినిమాకు మొదటి మహిళా సూపర్ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. కామెడీ నుంచి నెగిటీవ్ వరకువరకు వైవిధ్యమైన కథల్లో.. విస్తృతమైన పాత్రలో నటించి ఆకట్టుకుంది. 50 సంవత్సరాలు పైగా తెలుగు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. సౌత్ అన్ని భాషల్లోని సక్సెస్ అందుకోవడమే కాదు. బాలీవుడ్ లో వేరే లెవెల్ లో సత్తా చాటుకుని.. బాలీవుడ్ ప్రేక్షకులకు కలల రాణిగా మారిపోయింది. కాగా.. శ్రీదేవి చివరి మూవీ క్రైమ్ థ్రిలర్ మామ్. 2017 లో రిలీజ్ అయింది. ఇక శ్రీదేవి మరణించిన తర్వాత ఆమె బయోపిక్ కోసం తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ఎంతోమంది ఆరాటపడుతున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది శ్రీదేవి బయోపిక్ రూపొందించాలని ప్లాన్స్ జరుపుతున్న సంగతి తెలిసిందే. అదే టైంలో ఆ పాత్రను ఎవరు పోషిస్తే బాగుంటుందనే చర్చ కూడా వినిపిస్తూనే ఉంది. కాగా తాజాగా టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా.. ఓ ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడుతూ.. తనకు ఇండస్ట్రీ సూపర్ ఐకానిక్ శ్రీదేవి గారి పాత్రలో నటించాలనుందంటూ చెప్పుకొచ్చింది. అయితే.. తమన్నాకు శ్రీదేవి పాత్ర పోషించే అంత స్థాయి ఉందా.. ఆమెలా ఆడియన్స్ను మెప్పించగలదా అనే ప్రశ్నకు ఎవరు సరైన సమాధానం చెప్పలేరు. కానీ.. శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ మాత్రం దానికి పదునైన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
ఎలాంటి మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ఇటీవల ఇంటర్వ్యూలో ఖుషి కపూర్ మాట్లాడుతూ.. తన తల్లిలా మరెవరు ఉండలేరని.. ఆమె స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరని.. కుండబద్దలు కొట్టింది. చిన్నప్పటి నుంచి నటనపై అంతటి అంకితభావం.. అద్వితీయమైన ప్రతిభ ఎవరు రిప్లేస్ చేయలేరంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇతరులకి కాదు.. మాకు కూడా అమ్మ స్థానం అసాధ్యమని.. పరోక్షంగా చెప్పుకొచ్చింది. తనపై.. ఆమె సోదరీ జాన్వీపై శ్రీదేవి చూపించిన ప్రభావం అసాధారణమైనది కాదని.. అయినా రాబోయే వందేళ్లలో కూడా నేను మా అమ్మలా కాలేను. ఆమె మరో ప్రత్యేకమైన సృష్టి అంటూ.. నేను మా అమ్మలా కావాలంటే మరో జన్మ ఎత్తాల్సి ఉంటుంది ఏమో అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఖుషి కపూర్ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.