టాలీవుడ్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.. ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకుందో తెలిసిందే. ప్రేమతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో ఫిదా తో ఆడియన్స్ను పలకరించింది. సినిమా తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ రాణిస్తూ.. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో ఆకట్టుకుంటున్న సాయి పల్లవి.. ఇప్పుడు బాలీవుడ్ లో అడుగు పెట్టింది. అక్కడ రామాయణంలో సీత పాత్రలో నటిస్తున్న ఈ అమ్మడు.. లగ్జరీ లైఫ్ స్టైల్, ఓవర్ మేకప్ లను ఎక్కువగా ఇష్టపడదు. డి గ్లామరస్ పాత్రలకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటుంది. అంతే కాదు.. రెమ్యూనరేషన్ కూడా నిర్మాతలను దృష్టిలో పెట్టుకొని డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలోనే దర్శక, నిర్మాతలు ఎక్కువగా సాయిపల్లవిని హీరోయిన్గా తీసుకునేందుకు ఆసక్తి చూపుతారు.
ఎలాంటి డిమాండ్ లేకుండా షూటింగ్లో పాల్గొని సినిమాను పూర్తి చేసే ఈ అమ్మడు.. వచ్చిన అవకాశాలన్నీ సరిగ్గా సద్వినియోగం చేసుకుంటూ.. పర్ఫెక్ట్ కథలను ఎంచుకుంటూ రాణిస్తుంది. తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషలను వరుస సినిమాల్లో మెప్పిస్తుంది. ఇక సాయి పల్లవి రీసెంట్గా నాగచైతన్యతో కలిసి తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ సీక్వెల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఈ అమ్మడు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ నటిస్తున్న రామాయణంలో సాయి పల్లవి హీరోయిన్ గా బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా నుంచి లీకైన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. కాగా ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే రామాయణం సీక్వెల్లోను సాయి పల్లవి నటించనుందని.. రెండో భాగంలో కూడా ఆమె పాత్ర ప్రధానం కానందుని సమాచారం. దీంతో బాలీవుడ్లో రెండు సినిమాల్లో నటిస్తున్నట్లే. కాగా.. రామాయణం మొదటి భాగం వచ్చే ఏడాది దీపావళి సెలబ్రేషన్స్ భాగంగా రిలీజ్ కానుంది. సెకండ్ భాగం 2027 దీపావళికి రిలీజ్ చేస్తారు. ఇటీవల రామాయణం మొదటి పార్ట్ షూటింగ్ పూర్తయిందని.. మే లో సెకండ్ పార్ట్ షూట్ ప్రారంభించనున్నారని టాక్.