టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే వరుస బ్లాక్ బస్టర్ సినిమాలు అందుకుని తెలుగులో స్టార్ హీరోయిన్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిన ఈ అమ్మడు.. అన్నిటికంటే ఎక్కువగా రంగస్థలం జిగేలురాణి ఐటమ్ సాంగ్తో మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత అమ్మడికి వరుసగా స్టార్ హీరోలు సినిమాల్లో అవకాశాలు దక్కాయి. ముఖ్యంగా మాట్ల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తరికెక్కిన ఎన్టీఆర్ అరవింద సమేత, అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో సినిమాలు తో ఈమె బ్లాక్ బస్టర్లు అందుకుంది. ఈ రెండు సినిమాల రిజల్ట్ తర్వాత అమ్మడు తిరుగులేని ఇమేజ్తో వరుస సినిమాలతో దూసుకుపోతుందని అంత భావించారు.
కానీ.. తర్వాత ఈమె నటించిన అన్ని సినిమాలు ఫ్లాప్ లు కావడంతో.. మెల్లమెల్లగా టాలీవుడ్కు దూరమైంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ వైపు మక్కాం మార్చిన పూజ. అక్కడ కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. ముఖ్యంగా సల్మాన్ లాంటి స్టార్ హీరో సినిమాలో నటించిన అది ఫ్లాప్ గా నిలవడంతో.. మళ్లీ సౌత్ పైనే దృష్టి సారించింది. ఈ క్రమంలోని తాజాగా సూర్య హీరోగా రాబోతున్న రెట్రో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. సినిమా ప్రమోషన్స్లో ఇంటర్వ్యూకు హాజరై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. పూజ హెగ్డే మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఎంత మంది ఉన్నా వాళ్లంతా సినిమాకు వస్తారని లేదు.
ఇన్స్టాలో 26 మిలియన్ ఫాలోవర్లు ఉన్నా.. టికెట్లు తెగాలికదా అంటూ పంచ్ డైలాగ్ వేసింది. కొంతమంది సూపర్ స్టార్స్కి 5 మిలియన్ల కన్నా తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ.. వాళ్ళ సినిమాలకు కోట్లల్లో జనం వస్తారంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే పూజ చెప్పిన మాటలను రామ్ చరణ్ యాంటీ ఫ్యాన్స్.. చరణ్ కు లింక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్స్టాలో చరణ్కు 26 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా.. గేమ్ ఛేంజర్ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ గా నిలిచిందో తెలిసిందే. ఈ క్రమంలోనే పూజ 27 మిలియన్ ఫాలోవర్లు అనగానే.. ఈ పోస్ట్ కు చరణ్ ఇన్స్టా పేజ్ స్క్రీన్ షాట్ ను ట్యాగ్ చేస్తూ పూజా.. చరణ్ కు స్ట్రాంగ్ పంచ్ వేసింది అంటూ వీడియోను వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటింట తెగ వైరల్గా మారుతుంది.