స్టార్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీకి దూరమై 2ఏళ్లు గడుస్తున్న ఇప్పటికీ అదే ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది. అయితే ఇటీవల కాలంలో మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ అవుతున్న శ్యామ్.. ఈసారి హీరోయిన్గా మాత్రమే కాకుండా.. నిర్మాతగాను సత్తా చాటుకోవాలని ఫిక్స్ అయింది. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ సంస్థ స్థాపించి.. తన ఆలోచనలకు, అభిరుచులకు తగ్గట్టు సినిమాలను నిర్మించేందుకు సిద్ధమైంది. కాగా తాజాగా సక్సెస్ఫుల్గా మొదటి సినిమాను కంప్లీట్ చేసేసిన ఈ ముద్దుగుమ్మ సినిమాలో.. నటించిన హీరో, హీరోయిన్లు ఇతర నటీనటులంతా కొత్త వాళ్లే కావడం విశేషం. ఇక ఈమె నిర్మిస్తున్న ఈ సినిమాల్లో హీరోకో రెమ్యునరేషన్, హీరోయిన్కి ఓ రెమ్యునరేషన్ అని భేదాలు లేకుండా.. నటించిన ప్రతి ఒక్కరికి సమానమైన రెమ్యునరేషన్ ఇచ్చి సరి కొత్త ట్రెండ్ సెట్ చేసింది.
అయితే.. తాజాగా సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే కొద్ది గంటల క్రితం సినిమా రిలీజ్ డేట్తో సరికొత్త అఫీషియల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. మే 9న సినిమా రిలీజ్ కానున్నట్లు.. సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. కాగా.. ఇప్పటికే మే 9న ఏపి డిప్యూటీ సీఎం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కూడా రిలీజ్ చేయనున్నట్లు టీం అఫీషియల్ గా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో సమంత అదే తేదీని సెలెక్ట్ చేసుకుని సినిమా రిలీజ్ కు సిద్ధం అవడం.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు కోపాన్ని తెప్పిస్తుంది. హరిహర వీరమల్లు సినిమా మే 9న రిలీజ్ కానున్నట్లు ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. ఇది సమంతకు తెలిసి కూడా.. కావాలనే ఇలాంటి పనులు చేస్తుందని.. తన సినిమా అదే రోజున ప్రకటించిందని మండిపడుతున్నారు.
హరిహర వీర మల్లు రిలీజ్ డేట్ అదే అని తెలిసిన తనదైన ధోరణితో.. కావాలనే పట్టుబట్టి ఆటిట్యూడ్ చూపిస్తుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సమంత గతంలో పవన్ కళ్యాణ్ తన ఫేవరెట్ హీరో అని.. ఆయన అంటే ఎంతో ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు ట్విటర్ తో పవన్ కళ్యాణ్ బర్త్డే వస్తే విషస్ తెలియజేసే సెలబ్రెటీస్ అందరిలో శ్యామ్ ముందుండేది. ఇక ప్రస్తుతం స్టార్ హీరోల అందరిని ఫాలో అవుతున్న ఈ అమ్మడు.. పవన్ ను మాత్రం ఫాలో అవ్వట్లేదు.. ఎన్నికల్లో సెన్సేషనల్ సక్సెస్ అందుకున్నప్పటికీ.. సినీ సెలెబ్రిటీస్ అంతా పవన్ కి విషెస్ తెలియజేసినా.. సమంత మాత్రం మౌనంగా ఉండిపోయింది. దీంతో సమంత, పవన్ మధ్యన ఏదో వివాదం చోటుచేసుకుందని.. పవన్ సనాతన ధర్మం నినాదం తీసుకోవడం ఆముకు నచ్చలేదని సోషల్ మీడియా వేదికగా టాక్ వైరల్ గా మారుతుంది.