టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ షో రిలీజ్ అవుతుందంటే థియేటర్లో ఫ్యాన్స్ హంగామా వేరే లెవెల్ లో ఉంటుంది. ఈ క్రమంలోనే పవన్ నటించిన సినిమా.. టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాగా.. పవన్ కళ్యాణ్ సినిమాలు పరంగానే కాదు.. వ్యక్తిగతంగాను చాలా మంచి వ్యక్తని.. అందర్నీ గౌరవిస్తూ ఎంతో నిజాయితీగా మాట్లాడుతూ ఉంటాడని అభిప్రాయాలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ఆయనతో నటించిన కో స్టార్స్ సైతం ఈ విషయాలు చెబుతూనే ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ తో నటించాలని ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ సైతం ఆరాటపడతారు.
కానీ.. ఓ స్టార్ హీరోయిన్ పవన్ కళ్యాణ్ తో సినిమా అని తెలిసినా.. అసలు నటించినని.. ఆ సినిమాను రిజెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? అసలు పవన్ సినిమాను ఆమె ఎందుకు రిజెక్ట్ చేసిందో.. ఒకసారి తెలుసుకుందాం. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు వాలు కళ్ళ సుందరి అనుపమ పరమేశ్వరన్. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ.. సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ కేరళ కుట్టి.. శర్వానంద్ శతమానం భవతి సినిమాతో హీరోయిన్ గా మారింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్తో ఎన్నో యూత్ ఫుల్ సినిమాలో నటించే అవకాశాలు కొట్టేసింది. దాదాపు టాలీవుడ్ యంగ్ హీరోల అందరితో నటించిన అనుపమ.. ఇప్పటికీ ఇండస్ట్రీలో నాలుగైదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బిజీబిజీగా గడుపుతుందంటే.. ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ఇక సెన్సేషనల్ హీరో జొన్నలగడ్డ సిద్దుతో నటించిన టిల్లు స్క్వేర్ తో అనుపమ రేంజ్ మరింతగా పెరిగిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోసిన అనుపమ.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు.. సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. అనుపమ గతంలో పవన్ కళ్యాణ్తో నటించే అవకాశం వచ్చినా రిజెక్ట్ చేసిందట. వకీల్ సాబ్ సినిమాలో అనన్య నాగళ్ళ పాత్ర కోసం మొదట అనుపమ పరమేశ్వరన్ను భావించారట. అయితే.. ఆ క్యారెక్టర్ కు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడంతో పవన్ కళ్యాణ్ సినిమా అయినా సరే వకీల్ సాబ్ సినిమాను అనుపమ రిజెక్ట్ చేసింది. ఆమెకు మొదటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమట.. అంతేకాదు రెస్పెక్ట్ కూడా.. కానీ క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ లేదని ఒక్క ఉద్దేశంతోనే తాను ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట. ఈ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది.