టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. తాజాగా మహేష్ కు ఈడి నోటీసులను జారీ చేసింది. ఈ నెల 28 ఉదయం 10:30కు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఈడి పేర్కొంది. సురానా, సాయి సూర్య డెవలపర్స్ మనీ లాండరింగ్ కేసులో ఈయనకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే మహేష్ బాబు ఆ రెండు కంపెనీలకు ప్రమోషన్స్ చేసేందుకు చక్ రూపంలో రూ.3.5 కోట్లు, లిక్విడ్ క్యాష్ గా రూ.2.5 కోట్లను తీసుకున్నట్లు సమాచారం. మొత్తం మీదు రూ.5.90 కోట్ల వరకు ఈ ప్రమోషన్లకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఈడి నిర్ధారించింది.
ఈ క్రమంలోనే మనీ లాండరింగ్కు పాల్పడిన కంపెనీలో పెట్టుబడులు పెట్టి.. ప్రజలు మోసపోవడానికి ఇన్ఫ్లుయెన్స్ చేసిన అభియోగంపై మహేష్ బాబుకు ఈడి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కాగా ఇటీవల ఈడి అధికారులు సూరానా, సాయి సూర్య డెవలపర్ సంస్థలపై దాడులు చేసి సోదరులు నిర్వహించిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ బోయినపల్లిలోని సురన ఇండస్ట్రీస్ ఎండి నరేంద్ర సూరానా ఇంట్లో భారీగా నగదు బయటపడడం.. అలాగే ఈ కంపెనీకి అనుసంధాన కంపెనీ అయినా సాయి సూర్య డెవలపర్ సంస్థ ఎండి. సతీష్ చంద్రగుప్త ఇంట్లో కూడా అదే రేంజ్ లో భారీగా నగదు ఉండడంతో మొత్తం నగదు అంతా సీజ్ చేశౄరు అధికారులు.
ఇక ఈ రెండు కంపెనీల నుంచి పళ్ళు డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా.. కొద్ది రోజుల క్రితమే సాయి సూర్య డెవలపర్స్ సతీష్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వట్టినాగులపల్లిలో వెంచర్ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేశాడని సతీష్ పై బాధితులు ఫిర్యాదు చేయడంతో.. హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ కేసులో భాగంగానే రెండు కంపెనీలను ప్రమోట్ చేసిన సూపర్ స్టార్ మహేష్కి కూడా ఈడి అదేశాలు పంపడం హాట్ టాపిక్ గా మారింది.