టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తోలిసిందే. కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ తన పెట్నెస్, అందంతో ఇప్పటికి అమ్మాయిలను ఆకట్టుకుంటున్నాడు. కాగా తాజాగా నాగార్జునకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. నాగార్జున వల్ల ఇద్దరు ప్రాణ స్నేహితులు విడిపోయారని.. కావాలనే వారి మధ్యన నాగార్జున చిచ్చుపెట్టాడని న్యూస్ నెటింట వైరల్గా మారుతుంది. ఇంతకీ ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎవరూ.. అసలు వారి మధ్యన గొడవ ఎందుకు జరిగింది ఒకసారి చూద్దాం.
ఇంతకీ ఆ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ మరెవరో కాదు.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. దివంగత స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి. ఇక వీళ్ళిదరి మధ్య దూరం పెరగటానికి కారణం నాగార్జుననే అని స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ చక్రి బ్రతికున్న సమయంలో ఓ ఇంటర్వ్యూలో చెప్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ పూరి జగన్నాథ్ కి, చక్రికి మధ్య నాగార్జున ఎందుకు చిచ్చుపెట్టారు.. అసలు ఏం జరిగిందో.. ఒకసారి చూద్దాం. ఇక పూరి జగన్నాథ్ – చక్రిల కాంబినేషన్ ఓ హిట్ పెయిర్ కాంబో. తన సినిమాలకు ఎక్కువగా చక్రి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఉండేవాడు. అలా వీళ్ళాద్దరి కాంబోలో ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్ బ్లాక్ బస్టర్లు గా నిలిచాయి.
అయితే ఇలాంటి సమయంలో నాగార్జున చిచ్చు రాజేశాడట. చక్రి బ్రతికున్న సమయంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పూరి జగన్నా డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాకు తాను మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించానని.. కానీ నాగార్జునతో తెరకెక్కించిన సూపర్ సినిమాకు మాత్రం ఆయన నన్ను పక్కన పెట్టి హిందీ మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌటాని తీసుకొచ్చారు. ఆ టైంలో నేను ఎంతగానో బాధపడ్డా.. కారణం పూరి తన సినిమాలన్నింటికీ నన్నే మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకునేవారు. కేవలం నాగార్జున వల్ల సూపర్ సినిమాకు నన్ను పక్కన పెట్టి మరో మ్యూజిక్ డైరెక్టర్ తో సినిమా తాసారు. తర్వాత మళ్లీ నేను పూరి జగన్నాథ్ తో సినిమా చేయలేదంటూ చెప్పుకొచ్చాడు. అలా మా మధ్య నాగార్జున కారణంగా దూరం పెరిగిందని చక్రి ఎమోషనల్ అయ్యారు.