టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు పై మంచువారి వారసుడు.. మోహన్ బాబు పెద్దకొడుకు మంచు విష్ణు కేసు పెట్టబోతున్నారని.. లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నారంటూ సమాచారం. ఇంతకీ అసలు శ్రీ విష్ణు ఏం చేశాడు.. శ్రీ విష్ణు పై మంచు విష్ణు కేసు పెట్టడానికి గల కారణం ఏంటి.. అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ రచ్చ ఎందుకు మొదలైందో.. ఒకసారి తెలుసుకుందాం. ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఎక్కువగా ట్రాలింగ్స్ ఎదుర్కొనే ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది మంచు కుటుంబం అనే చెప్పాలి. అన్నదమ్ముల మధ్య, తండ్రి కొడుకులు మధ్య వివాదాలతో ఎప్పటికప్పుడు నెటింట వైరల్ అవుతూనే ఉంటారు.
ఇక అసలు మ్యాటర్ ఏంటంటే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప భారీ బడ్జెట్తో మోహన్ బాబు నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు జూన్ లో రిలీజ్ కోసం సిద్ధం అవుతుంది. అయితే.. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా నెటింట దానిపై ఎన్నో ట్రోలింగ్స్ ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా.. శివయ్య అనే పదం కన్నప్ప మూవీ లో ఎక్కువగా వినిపించింది. అయితే ఈ పదాన్ని కూడా సోషల్ మీడియాలో జనాలు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో శ్రీ విష్ణు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతున్నాయి.
శ్రీ విష్ణు మరికొద్ది రోజుల్లో హీరోగా సింగిల్ సినిమాతో ఆడియన్స్ను పలకరించనన్నాడు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్లో శ్రీ విష్ణు మంచు కురిసిపోతుంది, శివయ్య అనే రెండు పదాలను వాడినట్లు సమాచారం. అయితే పదే పదే కన్నప్ప మూవీలో శివయ్య అనే పదం వస్తుంది.. ఈ పదాన్ని తన సినిమాలో కామెడీ పదంగా శ్రీ విష్ణు ఉపయోగించుకున్నట్లు.. అలాగే ఈ సినిమాలో ఒక బూతు పదాన్ని మంచు కురిసిపోతుంది అని వాడుకున్నట్లు టాక్ నడుస్తుంది. ఈ రెండు పదాలు కూడా మిస్ యూజ్ చేయడం మంచు విష్ణకు అస్సలు నచ్చలేదట. ఒకటి తన సినిమాలో ఉన్న శివయ్య పదాన్ని ట్రోలింగ్ చేయడం గా, మరోకటి మంచు కురిసిపోవడం అనే పదాన్ని మంచు విష్ణు ఇంటిపేరును అవమానించినట్లుగా భావించి ఇప్పటికే ఈ రెండు పదాల విషయంలో మూవీ టీం పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ రెండు పదాలు ఉపయోగించి తన ఫ్యామిలీని సినిమాను అవమానించారనే కోపంతో లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధమయ్యాడట. కేసు పెట్టడమే కాదు.. ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఫిర్యాదు చేయనున్నట్లు టాక్ నడుస్తోంది.