టాలీవుడ్ లో 1111 రోజులు ఆడేనా ఏకైక సినిమా ఏదో తెలుసా.. హీరో ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఓ సినిమా రిలీజ్ అయ్యి.. 50 రోజులు ఆడిందంటేనే గొప్ప విషయం. మహా అయితే వంద రోజులు. అంతకుమించి సినిమా ఆడడం అంటే అది పెద్ద మిరాకిల్. ప్రస్తుతం సినిమాను అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేసి అతి తక్కువ సమయంలోనే కలెక్షన్లు రాబట్టి తమ సినిమాను హిట్ టాక్ తెచ్చుకుంటున్నారు నిర్మాతలు. అయితే.. గతంలో ఇలా ఉండేది కాదు. సినిమా 100 రోజులు కచ్చితంగా ఆడితేనే అది హిట్. ఇక 175 రోజులు ఆడితే అది సిల్వర్ జూబ్లీ. ఇక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాల వరకు నిరంతరాయంగా థియేటర్లలో ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే తెలుగు సినీ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక ప్రేక్షకు ఆదరణ పొంది ఏకంగా 1111 రోజులు ఆడిన ఏకైక సినిమా ఏంటో చాలామందికి తెలిసి ఉండదు.

Jai Lava Kusa Movie Teaser 3 Days To Go తాతయ్య లోగో సెంటిమెంట్...!

ఇప్పటివరకు ఆ సినిమా రికార్డును మరి ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేక పోయింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో.. హీరోగా నటించినవరో ఒకసారి తెలుసుకుందాం. 1963 లో నందమూరి తారక రామారావు హీరోగా నటించిన లవకుశ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పటికీ శ్రీరామనవ‌మి వచ్చిందంటే ఈ సినిమాలోని సాంగ్స్ అజరామరంగా వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమా పాటలు లేకుండా పండుగ పూర్తికాదు. అంత‌లా సాంగ్స్ ఎవర్గ్రీన్ హిట్‌గా నిలిచాయి. అయితే అప్పట్లోనే ఈ సినిమా ఏకంగా 1111 రోజులు నిరంతరాయంగా ఆడి సంచలనం క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ సరసన అంజలీదేవి సీతగా నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు.. తమ ఊళ్ళ నుంచి పట్టణాలకు ఎడ్ల బండ్లు కట్టుకొని మరి వెళ్లేవారు. టికెట్లు అందకపోతే నెక్స్ట్ ఆటకైనా సాధించుకునే.. సినిమా చూసే ఇంటికి వెళ్లే వాళ్ళు. అంతలా ఈ సినిమా సక్సెస్ అందుకుంది. ఇక ఇప్పటివరకు ఆ సినిమా రికార్డును మరే స్టార్ హీరో కూడా టచ్ చేయలేకపోయారు.

Legend (2014) - IMDb

అయితే ఆయన తనయుడైన నందమూరి నటసింహం బాలకృష్ణ.. లెజెండ్ సినిమా 1105 రోజులు ఆడింది. పొద్దుటూరులో అర్చన థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా 1105 రోజులు ప్రదర్శితమై రికార్డ్ సృష్టించింది. వాస్తవానికి థియేటర్ యాజమానితో పాటు, బాలయ్య అభిమానులు సైతం ఈ సినిమాని ఇంకా ఆడిద్దామని పట్టుబట్టినా.. తన తండ్రి రికార్డును తాను బ్రేక్ చేయడం ఇష్టంలేని బాలయ్య.. సినిమా అత్యధిక రోజులు ఆడిన రికార్డును తండ్రి పేరు పైనే ఉంచేయాలని భావించి ఆపించేసారట‌. ఇక ఎన్టీఆర్ నటించిన ఈ లవకుశ సినిమాకు సి. పుల్లయ్య, ఆయన తనయుడు సి.యస్. రావు.. సంయుక్తంగా దర్శకత్వం వహించారు. రామారావు, ఆంజన దేవి నిజమైన సీత,రాములుగా భావించిన అప్పటి ప్రేక్షకులు.. వారికి హారతులు కూడా పట్టేవారట‌.