గతేడాది ప్రభాస్ హీరో గా తెరకెక్కి.. బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాల్లో కల్కి ఒకటి. బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన ఈ సినిమా అంచనాలను మించి లాభాలను కొల్లగొట్టింది. డైరెక్టర్ నాగ వంశీ.. ఈ సినిమాతో ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో కల్కి సీక్వెల్పై ఆడియన్స్లో పిక్స్ లెవెల్ అంచనాల నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సీక్వెల్ వస్తుందా అంటూ.. ప్రభాస్ అభిమానులే కాదు.. సాధరణ ఆడియన్స్ కూడా ఎంతోమంది నెటింట చర్చలు మొదలు పెట్టారు. కాగా తాజాగా కల్కి సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారని ప్రశ్నకు నాగ్ అశ్విన్ ఫన్నీ రియాక్షన్ ఇచ్చారు.
ప్రస్తుతం ఆయన రియాక్షన్ హాట్ టాపిక్ గా మారింది. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. కల్కి.. మూడు, నాలుగు గ్రహాలు ఒకే వరుసలో ఉన్న టైంలో రిలీజ్ చేశానని.. కల్కి సీక్వెలను 7 ,8 గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చిన టైంలో రిలీజ్ చేస్తానని కామెంట్స్ చేశాడు. వేచి ఉండండి అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే రనాగ్ అశ్విన్ ఫన్నీ కామెంట్స్ నెటింట వైరల్గా మారుతున్నాయి. అంతేకాదు.. ఆయన కామెంట్స్ సీక్వెల్ పై మరింత హైప్ ని పెంచాయి. ఇక ఈ మూవీ భారీ బడ్జెట్తో.. భారీ లెవెల్లో రూపొందించనున్న సంగతి తెలిసిందే.
కాగా సినిమా స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకుందని.. ఏడాది చివరికి సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. ఈ సీక్వెల్లో ప్రభాస్కు స్క్రీన్ స్పేస్ మరింత ఎక్కువగా ఉండనుందట. భైరవ, కర్ణ యాంగిల్ లో సినిమా కథ సాగునుందని.. ఈ సీక్వెల్ పాన్ వరల్డ్ రేంజ్ లో హిట్ అయి మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కల్కి సీక్వెల్ ట్విస్ట్లు ఎంత ఆసక్తికరంగా ఉండనున్నాయని.. ప్రభాస్ రేంజ్ను మార్చేసే సినిమాగా.. ఈ మూవీ ఉండనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ రెమ్యునరేషన్ ప్రస్తుతం రూ.120 కోట్ల రేంజ్ లో ఉండగా.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రభాస్ కెరీర్ పరంగా మరింత బిజీ కానున్నాడు.