టాలీవుడ్ మాన్ అఫ్ మాసస్ ఎన్టీఆర్.. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ బడా ప్రాజెక్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్తో దూసుకుపోతున్నాడు. మరొపక్క ప్రశాంత్ నీల్ యాక్షన్ సినిమాలతో సత్తా చాటుకుంటున్నాడు. ఈ క్రమంలోనే.. తారక్ – నీల్ కాంబోలో వస్తున్న సినిమాపై ఆడియన్స్లో భారీ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం అంటూ అభిమానులు గట్టి నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్లో రూపొందిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన సినిమా సెట్స్లో.. తాజాగా తారక్ ఎంట్రీ ఇచ్చిన్న సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కోసం రంగంలోకి మరో బిగ్ బడా బ్యానర్.. టి సిరీస్ రంగంలోకు దిగనుందట.
టీ సిరీస్ తారక్ సినిమాకు బడ్జెట్ ను కేటాయించనుందని.. ఇక దీనికి ప్రతిఫలంగా సినిమాకు సంబంధించిన థియెట్రికల్ రైట్స్తో పాటు.. సినిమాలో షేర్స్ కూడా టి.. సిరీస్ తీసుకొనుందని సమాచారం. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఎన్టీఆర్ ఈ సినిమా షూట్ ప్రారంభించనున్నాడు. ఇక ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్. ఇక సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.