ఇది క్షమించరాని నేరం.. మా గుండె మొక్కలయింది.. తారక్, చిరు, బ‌న్నీ

తాజాగా జరిగిన జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడులు దేశం మొత్తాన్ని కలిచి వేసాయి. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో దుండగులు అతి సమీపం నుంచి వచ్చి తూటాల వర్షం కురిపించారు. మహిళలు చిన్నారులను వదిలేసి వారి ఎదురుగానే పురుషులను కాల్చి చంపేశారు. వీళ్ళలో ఇప్పటికి 26 మంది పర్యాటకులు ప్రాణాలను కోల్పోయారు. మినీ స్విజ్జ‌ర్ల్యాండ్ గా పేరుపొందిన అనంత నాగ్‌ జిల్లా.. పహల్ గ్రామ సమీప.. బైసరం లోయలో ఈ భయంకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇది క్షమించడానికి క్రూరమైన చర్య అంటూ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు.

Mohanlal, Sanjay Dutt and celebs condemn Pahalgam terror attack - India  Today

జమ్ము కాశ్మీర్ పాహ‌ల్గంలో 26 మంది అమాయక ప్రజలతో పాటు.. పర్యాటకులను కూడా కాల్చి చంపేశారని ఇది క్షమించరాని నేరం అంటూ వెల్లడించారు. దారుణమైన భయంకర ఘటనను దీనికి సంబంధించిన విషయాలను తెలుసుకుంటే గుండె పగిలిపోయిందని.. మరణించిన వారి కుటుంబాలకు బరువెక్కిన హృదయాలతో సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ.. కుటుంబాలకు జరిగిన నష్టాన్ని ఏది పోడ్చ‌లేదని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Only NTR? What About Allu Arjun, Kona Venkat?

పహల్గాం దాడి గురించి తెలిసి గుండె మొక్కలు అయింది.. బాధితుల కుటుంబాలకు బంధువులకు నా సానుభూతి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్న.. ఈ దుర్ఘటన హృదయ విదారకం అంటూ అల్లు అర్జున్ షేర్ చేసుకున్నారు. మరణించిన వారిని చూస్తే హృదయం తరుక్కుపోతుందని.. ఇప్పుడు నా ఆలోచనలన్నీ ఆ కుటుంబాల చుట్టూ తిరుగుతున్నాయంటూ ఎన్టీఆర్ రాసుకొచ్చాడు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని.. వారి కుటుంబాలకు న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నాం అంటూ ఎన్టీఆర్ పోస్ట్‌ను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పహాల్గం ఘటనపై సర్వత్ర చర్చ నడుస్తున్నాయి.