ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా.. స్టార్ సెలబ్రిటీలుగా రాణిస్తున్న వారంతా కేవలం నటనకే పరిమితమకుండా ఇతర బిజినెస్ రంగాల్లోనూ అడుగుపెట్టి సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. వాళలో కొంతమంది రిస్క్ చేసి నిర్మాతలుగా ను ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియాభట్ కూడా.. ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టి జిగ్ర సినిమా రూపొందించింది. కాగా ఈ సినిమా ఆలియా కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయినా వెనకడుగు వేయకుండా ఈసారి ఎలాగైనా భారీ బ్లాక్ బస్టర్ కొట్టి లాభాలు గడించాలని ప్లాన్తో ముందుకు వెళ్తుంది ఆలియా. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ను హీరోగా పెట్టి ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయనుందట ఆలియా.
ఇక చరణ్కు ఆర్ఆర్ఆర్ తర్వాత బాలీవుడ్లోనూ చాలా అవకాశాలు వచ్చాయి. బాలీవుడ్ బడా డైరెక్టర్స్ సైతం చరణ్తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ.. చరణ్ మాత్రం చాలా సెలెక్టివ్ గా స్టోరీలను ఎంచుకుంటున్నాడు. కారణం గేమ్ చేంజర్ డిజాస్టర్. బాలీవుడ్ లో చాలా కథలు విన్న ఆయనకు.. కిల్ డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్ చెప్పిన స్టోరీ మాత్రమే నచ్చిందట. ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే లేదని సమాచారం. ఇక ఈ సినిమాకు బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్తో పాటు.. ఆలియా భట్ సంయుక్తంగా ప్రొడ్యూసర్లుగా వ్యవహరించనున్నారని సమాచారం. గతంలో చరణ్, ఆలియా కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో మెరిసిన సంగతి తెలిసిందే.
మళ్ళీ వీళ్ళ కాంబోలో సినిమా రానుందని టాక్ ప్రస్తుతం వైరల్గా మారుతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గాను అలియాభట్ కనిపించనుందట. సుకుమార్ డైరెక్షన్లో మరో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ వంగతో సినిమా చేసే ఛాన్స్ ఉందని.. ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ మూడు సినిమాలు పూర్తయిన తర్వాత చరణ్ ఆ క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టనున్నాడట. త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన రానుందని సమాచారం. ఇక గతంలో చరణ్ జంజీర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో బిగ్గెస్ట్ డిజాస్టర్.. తర్వాత మళ్లీ చరణ్ బాలీవుడ్ వైపు చూడలేదు. ఇనేళ్ళ గ్యాప్ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న చరణ్. ఈ సినిమాతో అయినా మంచి సక్సెస్ అందుకుంటాడో.. లేదో.. చూడాలి.