వెయ్యి కోట్ల మోసం.. హీరో వేణుపై కేసు న‌మోదు..!

టాలీవుడ్ స్టార్ హీరోగా ఒకప్పుడు మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వేణు తొట్టెంపుడికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక తాజాగా వేణు తొట్టెంపూడిపై పోలీస్ కేసు నమోదు అయింది. ఫిబ్రవరి 4న వేణు తొట్టెంపూడీతో పాటు.. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్వాహకులుగా ఉన్న భాస్కర్ రావు, హేమలత, శ్రీవాణి, ఎండి పాతూరి ప్రవీణ్ పై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇక పోలీసుల నుంచి వచ్చిన తాజా కథనం ప్రకారం గతంలో ప్రోగ్రెసివ్ కన్‌స్ట్ర‌క్షన్ కంపెనీ ఉత్తరాఖండ్‌లో జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ పనిని తెహ్రి డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ద‌క్కించుకున్నారు. బంజారాహిల్స్ లోని రిత్విక్ ప్రాజెక్ట్స్, స్వాతి కన్స్ట్రక్షన్స్ సబ్ కాంట్రాక్ట్ గా తీసుకున్న ఈ ప్రాజెక్ట్ నుంచి స్వాతి కన్స్ట్రక్షన్స్ మధ్యలో తప్పుకోవడంతో.. రిత్విక్ కాన్స్ట్రక్షన్ 2002లో ఈ పనులను మొదలుపెట్టింది. ప్రోగ్రెసివ్ టీహెచ్డీసీ మధ్య విభేధాలు త‌లెత్త‌డంతో ఇరుపక్షాలు నాయ్యం కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి.

ఈ పనులకు సంబంధించి రూ. 1010.25 కోట్లు టిహెచ్‌డిసి ఖాతాల్లో జమ చేశారు. ఇక రిత్విక్ సంస్థ చేసుకున్న ఒప్పందాన్ని.. వేణు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ నిర్వాహకులు రద్దు చేయడంతో రిత్విక్ ఎండి.. రవికృష్ణ వారిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు బంజర హిల్స్ పోలీసులు చార్జిషీటు దాఖలు చేసి.. దర్యాప్తు చేయగా నాంపల్లి రెండో అడిషనల్ చీఫ్ మెట్రో మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వేణుతో పాటు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.