టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో సినిమా వస్తే బాగుండని ఎప్పటినుంచి సినీ ప్రేక్షకులంతా కోరుకుంటున్నారు. ఇక బోయపాటి ఇండస్ట్రీకి అడుగుపెట్టి దాదాపు 20 సంవత్సరాలు పూర్తయింది. అయితే బోయపాటి చిరు తనయుడు చరన్ తో ఓ సినిమా తరికెక్కించిన చిరంజీవితో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇక ప్రస్తుతం నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రాజెక్ట్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో వరస సినిమాలు తెరకెక్కి బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్నాయి.
ఈ క్రమంలోనే అఖండ సీక్వెల్ పై ఇండస్ట్రీలో వర్గాల్లోనూ టాలీవుడ్ ఆడియన్స్లోను విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి. ఇక వీరిద్దరి కాంబోలో అఖండ 2 నాలుగో సినిమా కావడం విశేషం. అయితే బోయపాటి, చిరు కాంబినేషన్లో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ప్రస్తుతం చిరంజీవి శ్రీకాంత్ వదల కాంబినేషన్లో ఓ సినిమా, అనిల్ రావిపూడి డైరెక్షన్లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాగా గతంలోనే చిరంజీవి కోసం బోయపాటి ఓ కథను రాసుకున్నాడట. కానీ.. మెగాస్టార్ తో ఆ కాంబినేషన్ సెట్ కాలేదని స్వయంగా ఓ సందర్భంలో బోయపపాటి శ్రీను వెల్లడించాడు. చిరంజీవితో సినిమా చేయాలనుకునే లోపు బాలయ్య తో సినిమా సెట్ అయిందని.. అప్పుడు తీసిన సినిమానే అఖండ అంటూ బోయపాటి చెప్పుకొచ్చాడు.
అలా చిరుతో బోయపాటి సినిమా క్యాన్సిల్ కావడానికి బాలయ్య ఇన్ డైరెక్ట్గా కారణమయ్యారు. ఇక ఇప్పటికైన బోయపాటి శ్రీను తన కథతో చిరంజీవిని మెప్పిస్తే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా సాధ్యమయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు బోయపాటి అలాంటి కథను చిరంజీవికి వినిపించలేకపోయారని.. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో సినిమా తరికెక్కలేదంటూ.. ఫ్యూచర్లో తన కథతో బోయపాటి.. చిరుతో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకుంటాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం చిరంజీవి కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులపై దృష్టి సారిస్తుండగా.. మెగాస్టార్ తన రాబోయే సినిమాలతో మరిన్ని సక్సెస్ లు అందుకని బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయలంటూ అభిమానులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.