దివంగత నటుడు నందమూరి తారకరత్నకు టాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉంది. చిన్న వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ మరణించారు. ఈ వార్త అభిమానుల హాట్ బ్రేక్ చేసింది. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు సినిమాల్లో ఊహించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. ఇక తర్వాత అలేఖ్యను ప్రేమించి వివాహం చేసుకున్న తారకరత్న.. ఇంట్లో విభేదాల కారణంగా కుటుంబం నుంచి బయటకు వచ్చేసాడు.
చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నా.. గతేడాది.. టీడీపీలో యాక్టివ్ కావాలనే ఉద్దేశంతో యువ్వగళం పాదయాత్రలో పాల్గొన్నాడు. ఇక కొన్ని రోజులకే గుండెపోటుతో మరణించారు. దీంతో అప్పట్లో నారా, నందమూరి కుటుంబాలు అన్ని తామి దగ్గరుండి చూసుకుంటామని హామీ ఇచ్చాయి. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ.. తారకరత్న ఫ్యామిలీకి ఎప్పుడు అండగా ఉంటామని వివరించారు. అయితే తారకరత్న చనిపోయిన ఇన్ని రోజులకు ఆయన ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం తారకరత్న కూతురు నిష్కా హాఫ్ సారీ ఫంక్షన్.
హైదరాబాదులో గ్రాండ్ గా ఈ వేడుకలు జరిగాయి. ఇందులో తల్లి అలేఖ్య.. ఆమె ఇద్దరు తమ్ముళ్లతో పాటు పలువురు బంధుమిత్రులు సందడి చేశారు. వారంతా సంప్రదాయ బట్టలలో ఆకట్టుకున్నారు. అయితే ఈ ఫంక్షన్ లో నారా, నందమూరి కుటుంబాలు పాల్గొనకపోవడం అందరికీ షాక్ను కలిగిస్తుంది. తారకరత్న కుటుంబానికి అండగా ఉంటామన్న బాబు, లోకేష్, బాలయ్య ఈ ఫోటోలో ఎక్కడ కనిపించడం లేదే.. నందమూరి, నారా కుటుంబాలు ఎక్కడ.. అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వీరు ఈ ఫంక్షన్ లో ఎందుకు పాల్గొనలేదని చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.