టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. చివరిగా నటించిన కల్కి సక్సస్తో ఫుల్ జోష్లో ఉన్న ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమా షూట్లో బిజీగా గడుపుతున్నాడు. దీంతోపాటే కల్కి 2, సలార్ 2, ఫౌజి ఇలా దాదాపు అరడజన్ సినిమాలకు పైగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నటిస్తున్నాడు. వీటిలో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కనున్న స్పిరిట్ కూడా ఒకటి. ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ నెలకొంది. యానిమల్ సినిమాతో సంచలన సృష్టించిన సందీప్ రెడ్డి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా కావడంతో సినిమాపై మొదటి నుంచే హైప్ నెలకొంది.
అయితే కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ కాదు.. పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ అంతా సినిమా కోసం ఎదురుచూసే రేంజ్లో.. ప్రేక్షకుల్లో హైప్ను పెంచేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే సైఫ్ అలీఖాన్, కరీనాకపుర్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్లో నటిస్తున్నారంటూ.. వారి పాత్రలపై కూడా వార్తలు వినిపించాయి. దానికి తగ్గట్టుగానే సందీప్ రెడ్డి ఆ జంటను కలిసి వారికి కథలోని పాత్రలను వివరించినట్లు సమాచారం. ఇప్పుడు ఏకంగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే వాటిపై అఫీషియల్ ప్రకటన రాకున్నా.. ఈ రేంజ్లో భారీ తారాగణం సినిమాలో ఉన్నారంటూ వార్తలు వైరల్ అవ్వడంతో సినిమా పై ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ నెలకొంది. యాక్షన్ సీన్స్, ఫైట్స్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో హాలీవుడ్ రేంజ్ లో ఉండనున్నాయట. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్తో టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ కలిసి సినిమాకు ప్రొడ్యూసర్లుగా వివహరించనున్నారు. ఇక ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర సంగీతం అందించనున్నాడు. కథతో సందీప్ తన మార్క్ యాక్షన్తో.. మరోసారి సత్తా చాటనున్నాడంటూ ఫ్యాన్స్ తమ అభిప్తాయం బ్యక్తం చేస్తున్నారు.