పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటించనున్న సినిమాల్లో స్పిరిట్ కూడా ఒకటి. మోస్ట్ అవైటెడ్ గా అభిమానులంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాయి సినిమా అంతకంతకు ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ ప్రస్తుతం.. ది రాజా సాబ్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తుదిదశకు చేరుకుందని.. దీని తర్వాత ఫౌజీ సినిమాను పూర్తి చేసి స్పిరిట్ సెట్స్ లోకి ప్రభాస్ అడుగుపెట్టనున్నాడని సమాచారం. అయితే మొదట స్పిరిట్ తెరకెక్కకుండా ఈ ఆలస్యానికి కారణం సందీప్ రెడ్డివంగా పెట్టిన షాకింగ్ కండిషన్ కారణం అట. ఇంతకీ ఆ కండిషన్ ఏదో కాదు.. సందీప్ రెడ్డి డైరెక్షన్లో సినిమా నటించే సమయంలో మరే సినిమాలోని ప్రభాస్ నటించకుండా.. తన మూవీ కోసమే టైం కేటాయించాలని షరతు పెట్టారట.
ఈ క్రమంలోనే ప్రభాస్ మొదటిది రాజాసాబ్ ఫౌజి సినిమాలను పూర్తి చేసి తర్వాత స్పిరిట్ సినిమా సెట్లోకి అడుగు పెట్టాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. మరో నాలుగు, ఐదు నెలల తర్వాత స్పిరిట్ సినిమా షూటింగ్లో ప్రభాస్ సందడి చేయనున్నాడు. సాధారణంగా రాజమౌళి మాత్రమే తన సినిమాలో నటించే హీరోలకు ఇలాంటి కండిషన్ పెడతాడు. అలాంటిది ఇప్పుడు సందీప్ రెడ్డివంగా కూడా ఇదే ఫాలో అవుతూ ఉండడంతో జక్కన్నను మించి ట్విస్ట్లు ఇస్తున్నాడే.. ఈ సినిమా విషయంలో ఎందుకంత గోప్యంగా వ్యవహరిస్తున్నాడు.. అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోయింది. ఇక ఈ సినిమాలో సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ను ఎప్పుడు చూడని విధంగా డిఫరెంట్ లుక్ లో చూపించాలని ప్రయత్నంలో ఉన్నాడట.
దీనికోసమే అలాంటి షరతు విధించారని.. ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ వార్తల్లో వాస్తవం తెలియాలంటే సందీప్ రెడ్డి క్లారిటీ ఇవ్వాల్సిందే. ఇక ఆయనతో పాటు ఫ్యామిలీ మొత్తం ప్రొడ్యూసర్లుగా మారి తన సినిమాలను రూపొందిస్తున్నారు. ఇక సందీప్ రెడ్డి కెరీర్ పరంగా ప్రతి సినిమాకు తన రేంజ్ మరింతగా పెంచుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలంతా ఆయన డైరెక్షన్లో నటించడానికి ఆసక్తి చెబుతున్నారు అంటే.. ఆయన తన సినిమాలతో ఎలాంటి క్రేజ్ తెచ్చుకున్నాడు తెలుసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆయనను అభిమానించే అభిమానుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతుంది. స్క్రిప్ట్కు ఎక్కువ సమయం తీసుకున్నా.. సినిమాలకు మాత్రం షూట్ వేగంగా పూర్తి చేసి ఆడియన్స్ను తన సినిమాతో ఆకట్టుకుంటున్నాడు సందీప్ రెడ్డి వంగ.