నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్కు తెలుగు ప్రజలలో ఎలాంటి కీర్తి, ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక పక్క నటుడుగా, మరోపక్క రాజకీయ నాయకుడుగాను లక్షలాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. పౌరాణికాల్లో ది బెస్ట్ ఎవరు అంటే టక్కున ఎన్టీఆర్ పేరే వినపడుతుంది. ఇప్పటికీ కృష్ణుడు, రాముడు పాత్రలు తలుచుకోగానే ఆయన మాత్రమే గుర్తుకు వచ్చేంతలా ఆయన తన నటనతో పాత్రలకు నిండుతనాన్ని తెచ్చి పెట్టేవాడు. అయితే ఎన్టీఆర్ తర్వాత నందమూరి వారసులుగా హరికృష్ణ, బాలకృష్ణ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు. మిగతా కొడుకులు కూడా ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టిన హీరోలుగా మాత్రం చేయలేదు. ఇక హరికృష్ణ, బాలకృష్ణలో బాలయ్య స్టార్ హీరోగా ఎదగాడు. హరికృష్ణ కొన్ని సినిమాలకే పరిమితమయ్యారు.
అయితే హరికృష్ణ ఆయన వారసులుగా కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లను ఇండస్ట్రీలోకి తీసుకువచ్చారు. మూడో తరం నటులుగా ప్రస్తుతం తారక్ టాప్ పొజిషన్లో దూసుకుపోతున్నాడు. ఇటీవల దేవర సక్సెస్ తో పాన్ ఇండియాలో తిరుగులేని మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ కూడా తన సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంటూ.. మరో పక్క ప్రొడ్యూసర్ గాను రాణిస్తున్నాడు. త్వరలోనే బాలయ్య వారసుడు మోక్షజ్ఞ కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనున్న సంగతి తెలిసిందే. అంతే కాదు జానకిరామ్ తనయుడు మూడవ ఎన్టీఆర్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నాడు. ఇక నందమూరి చైతన్య కృష్ణ రెండు మూడు సినిమాల్లో నటించిన పెద్దగా సక్సెస్ అందుకొని సంగతి తెలిసిందే. కాగా నందమూరి వారసులుగా అడుగుపెట్టిన ఇంతమంది హీరోల్లో ఎవరికీ రాని అన్నగారి టేస్ట్ కేవలం తారక్కు మాత్రమే వచ్చిందట.
సీనియర్ ఎన్టీఆర్ ఎలా చేస్తాడో ఫుడ్ విషయంలో ఎన్టీఆర్ కూడా అదే ఫాలో అవుతూ ఉంటారట. ఇటీవల బాలయ్య, చంద్రబాబు అన్స్టాపబుల్ డిస్కషన్ మధ్యలో సీనియర్ ఎన్టీఆర్ఖు జ్వరం వస్తే ఫుల్ నాటుకోడిని దిట్టంగా ఉప్పు, కారం దట్టించి కాల్చితిని దుప్పటి కప్పుకుని పడుకునే వారు.. జ్వరం ఉదయాన్నే హోష్ పటాక్ అయిపోయేది అంటూ బాలయ్య చెప్పిన సంగతి తెలిసిందే. ఇక గతంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ సందర్భంలో కీరవాణితో జరిగిన చిట్ చాట్ లో మాట్లాడుతూ తనకు ఇష్టమైన ఫుడ్ ఓ ఫుల్ నాటుకోడికి మసాల దట్టించి బాగా కాల్చిన తర్వాత కీమాల చేసుకొని చపాతితో పెట్టుకుని తానడమని.. అదితింటే ఉంటది అంటూ తన టేస్ట్ గురించి వర్ణించాడు. అలా ఈ ఫుడ్ హ్యాబిట్స్ సీనియర్ ఎన్టీఆర్ తో పాటు కేవలం జూనియర్ ఎన్టీఆర్కు మాత్రమే ఉందట. మరెవరు అలా చేయరని టాక్. ఈ క్రమంలోనే తాతకు తగ్గ మనవడు అంటూ.. కేవలం రూపం, నటనలోనే కాదు ఆహారపు అలవాట్లలోను ఇద్దరు మ్యాచ్ అవ్వడం విశేషం అంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది.