మెగాస్టార్‌తో అక్కినేని కొత్త కోడ‌లు శోభిత గుస‌గుస‌లు… నాగ్ ఏం చేశాడంటే..!

ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్‌ 2024 ఈవెంట్ ఇటీవల గ్రాండ్ లెవెల్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 28, 2024 సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో వైభవంగా ఈ వేడుకను జరిపారు. ఈ వేడుకకు సినీ దిగ్గజ నటులంతా హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఎన్నో ఫొటోస్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే నాగచైతన్య ఈవెంట్ కు వచ్చిన వెంటనే స్పెషల్ గెస్ట్ అమితాబచ్చన్ పాదాలకు నమస్కరించి.. ఆయన ఆశీస్సులు తీసుకున్న పిక్ అందరినీ ఆకట్టుకుంటుంది.

ANR National Award: Naga Chaitanya & Sobhita Dhulipala Pose First Time After Engagement For A Family Picture - Filmibeat

అంతేకాదు ఈవెంట్ కు నాగ చైతన్య.. తనకు కాబోయే భార్య అక్కినేని కొత్త కోడలు శోభిత ధూళిపాలను కూడా తీసుకువచ్చి సందడి చేశాడు. ఈ జంట ఈవెంట్ లోనే స్పెషలా అట్రాక్షన్ గా నిలిచారు. ఇద్దరు తమ ఫార్మల్ దుస్తులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ ఏడాది ఏఎన్ఆర్ నేషనల్ అవర్ 2024 ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవిని.. సత్కరించడానికి అమితాబ్ హాజరయ్యారు. ఏఎన్ఆర్ గౌరవార్థం అక్కినేని ఫ్యామిలీ నిర్వహిస్తున్న ఈ ఈవెంట్లో హాజరైన గెస్ట్ లను రిసీవ్ చేసుకుంటూ చైతన్య – శోభిత హంగామా చేశారు. అదేవిధంగా తన కాపోయే కోడలు శోభితను అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవికి.. నాగ్‌ పరిచయం చేయడం విశేషంగా ఆకట్టుకుంది.

చిరంజీవితో.. శోభిత, చైతు ఇద్దరు చాలాసేపు ముచ్చటించారు. ఇక మెగాస్టార్‌తో శోభిత గుసగుసలాడుతుండగా.. నాగార్జున ఇన్వాల్వ్ అయ్యి నవ్వుల్ పోయించారు. వీరందరి మధ్యన సరదా సంభాషణకు సంబంధించిన పిక్స్ నెటింట‌ వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో మెగాస్టార్, అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మెగాస్టార్ ఫ్యాన్స్ చిరు భోళా స్వభావం, వయసులో చిన్న వారితో కూడా ఆయన కలిసిపోయే తత్వం.. కాస్తయినా గర్వం లేని ఆయన వ్యక్తిత్వానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక అమితాబ్ చేతుల మీదుగా చిరంజీవి జాతీయ అవార్డుని అందుకున్న క్షణాన్ని మెగా అభిమానులు ఎంతో గొప్ప గౌరవంగా భావిస్తున్నారు.