ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల పెళ్లిళ్లు దాదాపు సీక్రెట్ గానే జరుపుకుంటున్నారు. ఉదాహరణకు తాప్సీ పన్ను సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల సిద్ధార్థ – అదితీ రావ్ హైదరి కూడా సీక్రెట్ వివాహం చేసుకున్నారు. ఇలా ఈ రెండు జంటల మ్యారేజ్లు సైలెంట్ గా ఎలాంటి ప్రచారం హంగామా లేకుండా జరుపుకున్నారు. వనపర్తిలో పురాతన దేవాలయంలో సిద్ధార్థ – అదితి రావ్ హైదరి తాజాగా ఒకటైన సంగతి తెలిసిందే. వివాహం తర్వాత వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇలా ఇండస్ట్రీలో ముందు ముందు సీక్రెట్ గా ఎవరికి, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రైవేట్ గా పెళ్లిళ్లు జరుపుకోవడానికి సెలబ్రిటీ ఆసక్తి చూపుతున్నారని.. గుసగుసలు తెగ వైరల్ అవుతున్నాయి. అలా త్వరలోనే సీక్రెట్ వివాహం చేసుకోనున్న జంటల్లో నాగచైతన్య, శోబితా ధూళిపాళ్ల జంట పేరు మొదట వినిపిస్తుది. సమంతతో డివోర్స్ తర్వాత నాగచైతన్య సోలో లైఫ్ లీడ్ చేస్తున్నా.. తాజాగా శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. పలువురు అతిధుల మధ్యలో సీక్రెట్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక వీరి పెళ్లికూడా ఎలాంటి ముందస్తు సమాచారం, ప్రచారం లేకుండా ఇలాగే జరుగుతుందని.. దీనికి నాగ్ ఫ్యామిలి సిద్ధమైనట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ జంట ఈ ఏడాది ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకోగా.. వచ్చేయడాది మార్చ్లో రాజస్థాన్లో ప్రైవేట్ వివాహం చేసుకొని ఉన్నారని టాక్. బంధువులు, స్నేహితులు ఇలా ఎవరిని పిలవకుండా కేవలం లిమిటెడ్ కుటుంబ సభ్యుల మధ్యలోనే ట్రెడిషనల్ గా సింపుల్ గా పెళ్లి కానిచేయాలని ప్లాన్ లో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక నాగచైతన్య ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా గడుపుతున్నాడు.. అదే టైంలో శోభిత కూడా వరస సినిమాలతో కెరీర్ను లేట్ చేస్తుంది. కనుక వారు తమ కమిట్మెంట్స్ పూర్తయిన వెంటనే వివాహం షురు చేస్తారని టాక్. ప్రస్తుతం అక్కినేని, దూళిపాళ్ల కుటుంబాలు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసే పనిలో బిజీగా ఉంటున్నారని టాక్ నడుస్తుంది.