ఓర్నీ మనసంతా నువ్వే హీరోయిన్ కి అంత పెద్ద కొడుకు ఉన్నాడా..? మీరు ఓ లుక్ వెయండి..!

ఒకప్పుడు స్టార్ హీరో ఉదయ్ కిరణ్ నటించిన టాలీవుడ్ ఎవ్వర్ గ్రీన్ లవ్ స్టోరీ మనసంతా నువ్వే.. ఇప్పటికి ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ అందమైన ప్రేమ కథకు బి ఎన్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంది. సినిమాలో సాంగ్స్ ఇప్పటికీ యూట్యూబ్‌లో జనం వీక్షిస్తూనే ఉన్నారు. ఆర్ పి పట్నాయక్ అందించిన సంగీతం అప్పట్లో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్, రీమా సేన్‌ జంటగా నటించి మెప్పించారు. తనికెళ్ల భరణి, సునీల్, తను రాయ్ ,చంద్రమోహన్ ఇలా ఎంతో మందికి కీలకపాత్రలో నటించి ఆకట్టుకున్నారు.

ఇక ఈ సినిమాతో అప్పట్లో యూత్‌లో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ రీమాసేన్.. తర్వాత తెలుగు తో పాటు తమిళ్లోను ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే కొంతకాలానికి ఇండస్ట్రీకి దూరమైంది. కోల్‌క‌త్తాలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. నటనపై ఇంట్రెస్ట్ తో మోడలింగ్ లోకి అడుగుపెట్టి ఎన్నో ప్రకటనలను నటించిన తరువాత ఉదయ్ కిరణ్ సరసన మనసంతా నువ్వే సినిమాతో వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న ఈ అమ్మడు.. తర్వాత బాలీవుడ్ లోను అడుగుపెట్టింది. కానీ.. అక్క‌డ అమ్మ‌డుకు ఫ్లాప్ రావ‌డంతో అమ్మడికి అంతగా సెట్ కాలేదు.

అలాగే తమిళ్ లోను పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఊహించిన రేంజ్‌లో ఆఫర్స్ దక్కలేదు. దీంతో సినిమాలకు పూర్తిగా దూరమైనా రీమాసేన్.. 2012లో వ్యాపారవేత్త శివకుమార్‌ సింగ్‌ను పెళ్లి చేసుకుంది. ఇక వీరికి రుద్రవీర్ అనే ఓ బాబు కూడా ఉన్నాడు. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన రీమా.. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ముంబైలో లైఫ్ లీడ్ చేస్తుంది. చాలా కాలంగా సినిమా ఈవెంట్లకు, పార్టీలకు దూరంగానే ఉంటున్నారు రీమాసేన్. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ సందడి చేస్తుంది. తాజాగా రీమా తన ఫ్యామిలీ ఫొటోస్ షేర్ చేసుకోవడంతో.. ప్ర‌జెంట్ ఆ పిక్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇందులో రీమాసేన్ కొడుకు ఫొటోస్ చూసి అంత ఆశ్చర్యపోతున్నారు. వామ్మో ఈ ముద్దుగుమ్మకు అంత పెద్ద కొడుకు ఉన్నాడా.. అంటూ నోరెళ్ళబెడుతున్నారు.