రాజమౌళి తో మహేష్ సినిమా.. ఎన్టీఆర్ పిచ్చ కామెడీ..

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబో సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఏ సినిమా రాజమౌళి కెరీర్‌లోనే చాలా ప్రత్యేకంగా నిలిచేలా ప్లాన్ చేసుకుంటున్నాడు జక్కన్న. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించనున్నారు. ఇక రాజమౌళితో సినిమా అంటే సంవత్సరాలపాటు హార్డ్ వర్క్ తప్పదన్న సంగతి అందరికీ తెలుసు. పిప్పి తీస్తాడు అని ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ పలు సందర్భాల్లో వివరించారు. ఎన్టీఆర్ కూడా డైరెక్ట్‌గా మహేష్‌తో అలాంటి అర్థం వ‌చ్చేల కామెంట్స్ చెశారట. సొంత ఎక్స్పీరియన్స్ తో చెబుతున్న మాటలు అని ఎన్టీఆర్ కొన్ని కామెంట్స్ చేశారట.

అది ఫేక్ న్యూస్.. రూమర్స్‌పై మహేశ్-రాజమౌళి మూవీ నిర్మాత క్లారిటీ | Mahesh  Babu and Rajamouli Movie Producer Clarify On SSMB29 Casting Rumours | Sakshi

ఇంతకీ ఎన్టీఆర్ రాజమౌళితో సినిమాపై.. మహేష్ దగ్గర ఎలాంటి కామెంట్స్ చేశారో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో దేవర సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్న‌ సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ గెస్ట్ గా మహేష్ బాబు రానున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తారక్.. మహేష్ ను మొదటి నుంచి అన్నల ఫీలవుతుంటారు. మహేష్ కూడా తన సొంత మనిషిలా ఎన్టీఆర్ను ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇక కొరటాల, మహేష్ మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో మహేష్ బాబు కూడా ఈవెంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటూ తెలుస్తుంది.

ఇందులో భాగంగానే గతంలో మహేష్, ఎన్టీఆర్ మధ్యన జరిగిన ఓ క్రేజీ కాన్వర్జేషన్ నెట్టింట వైరల్ అవుతుంది. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంకి ఎన్టీఆర్ యాంకర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు మహేష్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్లో మహేష్ బాబు ఎన్టీఆర్ ఇద్దరు తమ పర్సనల్ విషయాలను, సినీ విషయాలను కూడా చర్చించుకున్నారు. అలాగే గేమ్ కూడా ఆడి ఎంటర్టైన్ చేశారు. ఈ క్రమంలో మహేష్ బాబును.. జూనియర్ ఎన్టీఆర్ మీరు ఏ ఏ ఆటలు బాగా ఆడతారని ప్రశ్నించాడు. దానికి ముందే రాజమౌళి టాపిక్ కూడా వచ్చింది.

ఇక రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ అప్పటికే స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, త్రిబుల్ ఆర్ సినిమాలో నటించారు. ఈ క్రమంలో తనకు రాజమౌళితో ఉన్న ఎక్స్పీరియన్స్ తో ఓ మాట అన్నాడు ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వంలో నటించడం అంటే సులువు కాదని వివరించాడు. రాజమౌళి గురించి చెప్పి మహేష్ ని భయపెట్టే ప్రయత్నం చేశారు తారక్. మీరు ఆటలు ఆడతారా అంటూ మహేష్ ను ప్రశ్నించాడు. ఒకప్పుడు క్రికెట్ ఆడే వాడిని.. కానీ ఇప్పుడు ఆడడం లేదని మహేష్ వివరించాడు. తర్వాత రబ్బర్ బాల్, టెన్నిస్ బాల్ తో ఆడతానని క్రికెట్ బాల్ ఉంటే కష్టమని మహేష్ చెప్పుకొచ్చాడు. అయితే తారక్ అక్కడే అసలు కామెంట్ చేశాడు. రాజమౌళితో సినిమా చేయబోతున్నారుగా అన్ని ఆటలు ఆడించేస్తాడు అంటూ సెటైర్‌ డైలాగ్ వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటింట తెగ వైరల్ గా మారుతుంది.