మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన హై వోల్ట్ యాక్షన్ డ్రామా దేవర. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ క్రమంలో దేవర పార్ట్ వన్ సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ అభిమానులకు పెద్ద శుభవార్తను వెల్లడించింది. దేవర స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చినట్లు టాప్ నడుస్తుంది. సినీ ఇండస్ట్రీలో టాక్ హీరోల సినిమాలు రిలీజ్ సమయంలో ప్రీమియర్ షోలోనే నిర్వహిస్తూ ఉంటారు.
అంతేకాదు మొదటివారం టికెట్ ధరల పెంపుకు కూడా ప్రభుత్వం ఒకోసారి పర్మిషన్లు ఇవ్వడం కామన్ గానే జరుగుతుంది. ఇక దేవర మూవీ టీం తెలంగాణ ప్రభుత్వాన్ని కలిసి స్పెషల్ షోలా టికెట్ ధరల పెంపుకు పర్మిషన్లు అడిగారని.. అందుకు సానుకూలంగా తెలంగాణ ప్రభుత్వం స్పందించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ జీవోను ఈరోజు రిలీజ్ చేయనున్నారట. తొలి రోజు అర్ధరాత్రి ఒంటిగంట షోకు అనుమతి ఇవ్వడంతో పాటు.. రోజు ఆరు ఆటలను రెండు వారాలపాటు ప్రదర్శించుకునేందుకు పర్మిషన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో రూ.50, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.100 పెంపుకు ప్రభుత్వం అనుమతినిచ్చినట్లు టాక్. ఇందుకు సంబంధించి అఫీషియల్ ప్రకటన త్వరలోనే రివీల్ కానుంది. ఇక ఎన్టీఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ లాంటి భారీ పాన్ ఇండియన్ సినిమా తర్వాత వస్తున్న సినిమాలు కావడం.. అలాగే దాదాపు తారక్ నుంచి సోలో సినిమా వచ్చి ఆరేళ్లు కావడంతో.. ఈ సినిమాపై తారక్ అభిమానులతో పాటు పాన్ ఇండియా లెవెల్లో అభిమానుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా రిలీజై ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.