రాజమౌళి , మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న చిత్రానికి ఇటీవలే గరుడ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే. అయితే అంతా బాగానే ఉన్నా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు.. కనీసం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈలోగా రకరకాల విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా క్యాస్టింగ్ కి సంబంధించి అప్డేట్స్ అసలు రాజమౌళికైనా తెలుసో లేదో కానీ తెరపైకి మాత్రం రకరకాల స్టార్ హీరోల, హీరోయిన్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి.
ముఖ్యంగా ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా చేస్తున్నాడంటూ ప్రచారం చేశారు. ఆ తర్వాత తంగలాన్ ఈవెంట్లో విక్రమ్ మాటలను బట్టి కన్ఫర్మేషన్ లేకుండానే ఆయన కూడా ఈ సినిమాలో ఉన్నారని నిర్ధారణకు వచ్చారు. వీరే కాదు దీపిక, మోహన్లాల్, నాగార్జున కూడా ఈ లిస్టులోకి జమ అయ్యారు. అలాగే ఒక అడుగు ముందుకేసి హీరోయిన్ గా చెస్లియా ఇస్లాన్ ఇప్పటికే ఆన్ బోర్డు కు వచ్చేసిందని, ఏకంగా ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా తయారు చేయించి వైరల్ చేస్తున్నారు.. అయితే ఇదంతా నిజమో కాదో తెలియదు కానీ అంతా ఉత్తిత్తి ప్రచారం చాలా జరుగుతుంది.
ఇప్పటికే రెండు మూడు వర్క్ షాపుల నిర్వహించిన రాజమౌళి తారాగణంలో ఎవరిని తీసుకోవాలి అనే విషయంపై స్పష్టమైన ఐడియా తోనే ఉంటారు. కాకపోతే ఆర్టిస్టుల కాల్ షీట్లు దొరికితే తప్ప ముందుకు వెళ్లలేని పరిస్థితి. లేదంటే ఆప్షన్లు కూడా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రాజమౌళి , మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు 9 సందర్భంగా గ్రాండ్ ప్రెస్ మీట్ పెట్టి అప్డేట్ ఇవ్వాలనుకున్నారు. కానీ పని మొత్తం ప్రాథమిక దశలోనే ఉండడంతో ఆ ప్రతిపాదన మానుకున్నారు.
ఎయిర్పోర్ట్, ప్రైవేట్ ఈవెంట్స్ లో బయటకి వస్తున్న మహేష్ బాబు కొత్త లుక్స్ చూసి అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు అయితే మరొకవైపు గరుడ అనుకుంటున్నారు కానీ ఇంకా క్లారిటీ లేదు. మరొకవైపు 2028లో రిలీజ్ ఉంటుందంటూ కొన్ని హ్యాండిల్స్ చేస్తున్న హడావిడి మాత్రం అంతా అబద్ధం అని చెప్పాలి.. ఏది ఏమైనా రాజమౌళి లేదా నిర్మాణ సంస్థ శ్రీ దుర్గా ఆర్ట్స్ టీం నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే తప్ప నమ్మలేని పరిస్థితి ఏర్పడింది.