టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో హీరోగా నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. యంగ్ దర్శకుడు వశిష్ఠ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ ఉంటుందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలు నిజమేనంటూ క్లారిటీ ఇచ్చింది యంగ్ హీరోయిన్ రమ్య పసుపులేటి. ఈ కొత్త హీరోయిన్ మొదట సోషల్ మీడియాలో భారీపాపులారిటి దక్కించుకుంది. తర్వాత నటనపై ఇంట్రస్ట్తో ఆవకాశల కోసం ప్రయత్నించింది. ఇక ఈ తెలుగు అమ్మాయి హీరోయిన్గా ప్రస్తుతం మంచి ఆఫర్స్ అందుకుంటుంది.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన విశ్వంభర సినిమా గురించి కూడా ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది రమ్య పసుపులేటి. తాజాగా ఈ అమ్మడు నటించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో రమ్య మాట్లాడుతూ.. విశ్వంభర గురించి చెప్పుకొచ్చింది. చిరంజీవి గారి పక్కన ఆయన చెల్లెలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నానని.. చాలాసేపు చిరంజీవి గారితో స్క్రీన్ పై కనిపిస్తానని చెప్పుకొచ్చింది. చిరంజీవి లాంటి వ్యక్తితో అవకాశం వస్తే ఎవరూ వదులుతారు.. అందుకే చెల్లెలు పాత్ర అయినా ఓకే చేసేసాను.
చిరంజీవి పక్కన ఛాన్స్ అని మాత్రమే చెల్లెలు పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను అంటూ చెప్పుకో వచ్చింది. నాతో పాటు ఎంతో మంది హీరోన్స్ కూడా చిరంజీవి పక్కన చెల్లెలుగా నటించారని వివరించింది. ఈ సినిమాలో ఆమెతో పాటు హీరోయిన్ సురభి.. మరో సీనియర్ నటి నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో త్రిష, ఆశిక రంగనాథన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇక ఒక పక్క సోషియా ఫాంటసీ అంటూనే.. మరోవైపు సిస్టర్ సెంటిమెంట్ అని కూడా ప్రేక్షకులకు హింట్ ఇస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో సినిమా స్టోరీ ఎలా ఉండబోతుందో.. ఎలాంటి అందుకుంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ఇక ఇప్పుడిప్పుడే రమ్య పసుపులేటి హీరోయిన్ గా ఎదిగే ప్రయత్నాల్లో బిజీ అవుతుంది.