ప్రస్తుతం దేశం మొత్తం ఎక్కడ చూసినా కల్కి.. కల్కి.. కల్కి.. ఈ పేరే వినిపిస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు సృష్టించిన ఈ సినిమా వసూళ్ల వర్షంతో దూసుకుపోతుంది. లాంగ్ రన్లో రూ.1000 కోట్ల వసూలు సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఇక కల్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ తో రెట్టింపు ఉత్సాహంతో ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాకు సిద్ధమవుతున్నాడు. దీంతో కల్కి తర్వాత ప్రభాస్ నటించిన బోయే ప్రాజెక్ట్ ఏమై ఉంటుంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎప్పుడో మొదలైంది.
ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ సల్లర్ సెకండ్ పార్ట్ శౌర్యంగా పర్వం షూటింగ్కు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సలాడ్ ది సీజ్ ఫైర్ కు సీక్వెల్ గా ఈ సినిమా రానుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా మొదటి భాగం ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో దీన్ని సెకండ్ పార్ట్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు మొదలయ్యాయి.
ఇక ఇప్పటికీ సినిమాను సగం షూటింగ్ పూర్తైనట్లు ప్రశాంత్ నీల్ గతంలోనే వివరించాడు. కాగా ప్రభాస్.. మారుతి డైరెక్షన్ లో నటిస్తున్న రాజాసాబ్ ఎప్ఉడో షూట్ ప్రార్భించిన సంగతి తెలిసిందే. కాగా కల్కి ప్రమోషన్స్లో బిజిగి ఉన్న డార్లింగ్ అ క్రమంలో సినిమాకు బ్రేక్ ఇచ్చాడు. ఇక తిరిగి రాజాసాబ్ సెట్స్లో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. ప్రస్తుతం షూట్ లో బిజీగా ఉన్నాడట ఈ క్రమంలోషూటింగ్ చివరి దశకు చేరుకుందని తెలుసతుంది. దీంతో శౌర్యంగా పర్వం పై దృష్టి పెట్టబోతున్నాడట రెబల్ స్టార్. ఆగస్టు రెండోవారం నుంచి ఆయన షూట్ లో జాయిన్ కాబోతున్నాడని తెలుస్తుంది.