8 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘ పెళ్లి చూపులు ‘ : రూ. 1 కోటి బడ్జెట్ తో.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రీతు వర్మ జంటగా తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన మూవీ పెళ్లి చూపులు. 2016లో జూలై 29న రిలీజ్ అయిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. కేవలం కోటి రూపాయల బడ్జెట్ తో వ‌చ్చిన‌ ఈ మూవీ రూ.39 కోట్ల గ్రాస్‌వ‌సూళ్ళ‌ను కొల్లగొట్టి భారీ సక్సెస్‌ అందుకుంది.

Pelli Choopulu (2016) - IMDb

అప్ప‌టివ‌ర‌కు ఎనో కష్టాలను ఎదుర్కొన్న విజయ్ దేవరకొండ కెరీర్‌కు ఈ మూవీ ఓ మైల్డ్ స్టోన్. ఇక ఈ సినిమా రిలీజ్ రిలీజ్ అయ్యి తాజాగా 8 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా నెటిజ‌న్లు.. ఈ సినిమా గురించి మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. కల్ట్‌ మూవీ అంటూ.. క్లాసికల్ మదర్ ఆఫ్ న్యూ ఇయర్ తెలుగు సినిమా అంటూ.. ప్రత్యేక పోస్టులతో సినిమా టీం ను అభినందిస్తున్నారు. సినిమా కంటే ముందు విజయ్ దేవరకొండ ప‌లు సినిమాలో నటించినా ఈ సినిమాతో మంచి పాపులారిటీ వ‌చ్చింది.

Meme Raja | 8 Years For Pelli Choopulu 💖 This Movie.. It's Songs.. 👌💙 Entha Honest And Wholesome ga untadho Movie Assalu.. 🥺💙 One Of My All Time… | Instagram

ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో పాటు రీతు వర్మ, ప్రియదర్శి, తరుణ్ భాస్కర్ కు మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. సినిమాలో నటన, న్యాచురల్ పెర్ఫార్మెన్స్.. తరుణ్ భాస్కర్ టేకింగ్, డైలాగ్ డెలివరీ భారీ సక్సెస్ కు కారణమయ్యాయి. సినిమాకు బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్, బెస్ట్ తెలుగు ఫిలిం ఇలా రెండు క్యాటగిరి నుంచి రెండు నేషనల్ అవార్డులు దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో వచ్చే.. నా సావు నేను సస్తా డైలాగ్‌ ఇప్పటికీ యూత్ లో ఎంతో మంది వాడుతూనే ఉన్నారు.