దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి నటవారసురాలుగా పెద్ద కూతురు జాన్వి కపూర్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదట బాలీవుడ్లో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. అక్కడ పలు సినిమాలతో భారీ పాపులారిటి దక్కించుకుంది. తర్వాత టాలీవుడ్ వైపు అడుగులు వేసింది. మొదటి తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంకా స్క్రీన్ పైకి రాకముందే.. అమ్మడు తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ నటిస్తున్న దేవర రెండు పార్ట్లుగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఇక రెండో భాగం లో కూడా జాన్వి కపూర్ కనిపించనుంది.
దీంతోపాటు రామ్ చరణ్, బుచ్చి బాబు సన్నా కాంబినేషన్లో.. కిలారు సతీష్ కుమార్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న సినిమాకు కూడా అమ్మడు హీరోయిన్గా సెలెక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాల తర్వాత మేకర్స్ ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఆర్సి 16 రన్నింగ్ టైటిల్ తో రూపొందించనున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలు నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా అమ్మడు మరో జాక్పాట్ ఆఫర్ కొట్టేసిందంటూ.. ముచ్చటగా తన మూడో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
అది కూడా ఓ క్రేజీ హీరోతో అమ్మడు రొమాన్స్ చేయడానికి సిద్ధమైందట. ఇంతకీ ఆ క్రేజీ హీరో ఎవరు.. ఆ సినిమా డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. జాన్వి కపూర్ తన మూడో సినిమాను నేచురల్ స్టార్ నానితో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కనుందని.. సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ వరుస అవకాశాలను అందుకుంటున్న జాన్వి కపూర్.. తెలుగు సినిమాల్లో నటించాలనేదే తన కోరిక అంటూ శ్రీదేవి గతంలో పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. తల్లి కోరికను నెరవేర్చేందుకు జాన్వి కపూర్ ప్రయత్నిస్తూ సక్సెస్ అందుకుంటుంది.