పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా 1999లో రిలీజై ఎలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో తెలిసింది. పి.ఆర్. ఎన్. ప్రసాద్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రీతి జింగాన్యా, అదితి గోవిత్రికార్ హీరోయిన్గా నటించి మెప్పించారు. సెకండ్ హీరోయిన్గా నటించిన గోవిత్రికార్ ఈ మూవీలో హే పిల్ల నీ పేరు లవ్లీ.. సాంగ్ తో బాగా పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఈ సినిమాతో అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కడతాయని అంత భావించారు. అయితే అనుకున్న దానికి భిన్నంగా అమ్మడికి అవకాశాలు రావడమే కష్టమైంది.
కేవలం ఒక్క సినిమాలో అది కూడా స్పెషల్ సాంగ్ చేసే ఆఫర్ మాత్రమే వచ్చింది. తర్వాత అమ్మడు టాలీవుడ్ సినిమాల్లో కనిపించలేదు బాలీవుడ్ లో మాత్రం పలు సినిమామలలో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ అడపా దడపా వెబ్ సిరీస్లు టీవీ షోలో పాల్గొంటు సందడి చేస్తుంది అదితి గోవిత్రికార్. ఇక తాజాగా తమ్ముడు సినిమా రిలీజై 25 ఏళ్ళు పూత అవడంతో.. మరోసారి ఈ అమ్మడి గురించి వార్తలు వైరల్గా మారాయి.
అయితే అప్పటికి, ఇప్పటికీ ఈ అమ్మడిలో చాలా మార్పులు వచ్చాయి. అప్పుడు హీరోయిన్గా, మోడల్గా ఎంతో అందం.. క్యూట్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఏజ్ పెరగడంతో వయసు పై పడిన ఛాయలు ముఖంలో స్పష్టంగా తెలుస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడి ఫొటోస్ చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. వామ్మో ఏంటి..? ఈ అతిధి ఇంతలా మారిపోయింది. అసలు ఈమె ఆదితి అంటే నమ్మలేకుండా ఉన్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు.