టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సినిమాలు.. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్కు రప్పించడంలో కీలకపాత్ర వహిస్తాయి. ఈయన చేసిన సినిమాలు క్లీన్ యు సర్టిఫికెట్ సినిమాలుగా తెరకెక్కుతాయన్న సంగతి తెలిసిందే. అందుకే ప్రేక్షకులంతా కూడా ఆయన సినిమాను చూడడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ముఖ్యంగా పండగ సీజన్లో వెంకటేష్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. వాటికి ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్లి ఎంజాయ్ చేయాలని భావిస్తూ ఉంటారు. థియేటర్లో చూసే ఆ సినిమా సక్సెస్కు ఆడియన్స్ కారణం అవుతూ ఉంటారు.
ఇక మాస్ మహారాజు రవితేజ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. స్టార్ హీరోగా ఎదిగాడు. సొంతంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. అటు మాస్.. ఇటు క్లాస్ అని తేడా లేకుండా ఎలాంటి పాత్రయినా ఒదిగిపోయి నటించి తన సత్తా చాటుకుంటాడు రవితేజ. ఇలాంటి క్రమంలో వెంకటేష్, రవితేజ కాంబోలో ఓ బ్లాక్ బస్టర్ మల్టి స్టారర్ మూవీ మిస్ అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకి ఆ సినిమా మరేదో కాదు విజయ సేతుపతి, మాధవన్ కలిసి నటించిన విక్రమ్. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని.. వెంకటేష్, రవితేజను ఇందులో హీరోలుగా పెట్టుకోవాలని మొదట భావించారట మేకర్స్.
కానీ అనుకోని కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. ఎందుకు ప్రాజెక్ట్ ఆగిపోయింది అనే విషయంపై అప్పట్లో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చూడాలని అభిమానులు కూడా ఎంతో ఆసక్తి చూపారు. అయితే అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురయింది. విక్రం వేద్ సినిమా మిస్ కావడంతో మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో హరిష్ శంకర్ మరో సినిమాను ప్రారంభించాడు. అయితే ఇది కూడా మెటీరియలైజ్ అవ్వలేదు. ప్రస్తుతం వీరిద్దరు కాంబోలో బ్లాక్ బస్టర్ మూవీ మిస్ అయిందని వార్త వైరల్ అవ్వడంతో అంత ఆశ్చర్యపోతున్నారు.