నైజాంలో డిస్ట్రిబ్యూషన్ కింగ్గా పేరున్న దిల్ రాజుకు ఇటీవల గట్టి పోటీ ఎదురవుతోంది. మరి ముఖ్యంగా నైజాం డిస్ట్రిబ్యూషన్లోకి మైత్రీ మూవీస్ సంస్థ ఎప్పుడు అయితే ఎంటర్ అయ్యిందో అప్పటి నుంచి అక్కడ రాజు హవా చెల్లడం లేదు. ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా రాజు చెప్పిందే వేదం.. ఆయన ఎన్ని థియేటర్లు ఇస్తే అన్ని థియేటర్లలోనే ఆ సినిమా రిలీజ్ చేయాలి.. ఇలా ఏవేవో కండీషన్లు ఉంటాయన్న ప్రచారం జరిగింది.
మైత్రీ సంస్థ సొంత సినిమాలు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య ఒకేసారి ఓన్గా రిలీజ్ చేసుకుని రెండు సూపర్ హిట్లు కొట్టడంతో నైజాంలో మైత్రీ హవా స్టార్ట్ అయ్యింది. కట్ చేస్తే ఈ సంక్రాంతికి హనుమాన్ సినిమాకు కొందరు థియేటర్లు ఇవ్వకపోయినా మైత్రీ డిస్ట్రిబ్యూట్ చేసి పాన్ ఇండియా రేంజ్ బ్లాక్బస్టర్ కొట్టింది. అక్కడ నుంచి నైజాంలో మైత్రీ సంస్థ హవా స్టార్ట్ అయ్యింది.
చాలా పెద్ద ప్రాజెక్టులు.. పలు కీలక ప్రాజెక్టులు మైత్రీ చేతికే చిక్కుతున్నాయి. తాజాగా రామ్ – పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా నైజాం రైట్స్ కూడా ఇప్పుడు దిల్ రాజును కాదని మైత్రీ వాళ్లకే ఇచ్చారు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా కావ్య థాపర్ హీరోయిన్ గా మాస్ అండ్ డైనమిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
గత రెండేళ్లలో ఎన్నో సినిమాలు రిలీజ్ చేసి భారీ లాభాలు అందుకున్నారు అలాగే వీరి డిస్ట్రిబ్యూషన్ నుంచి సినిమా అంటే డెఫినెట్ గా హిట్ అవుతుందన్న టాక్ ఉంది. మరి ఈ సినిమా కూడా హిట్ అయితే దిల్ రాజుకు వరుస షాకుల మీద షాకులే అని చెప్పాలి.