భారీ సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి రానా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడు ఫ్యామిలీ ఇమేజ్ను వాడుకోకుండా తనదైన స్టైల్ లో కథలను ఎంచుకుంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. హీరో పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా.. కంటెంట్ ఉందనిపిస్తే ఎలాంటి పాత్రలోనైనా నటించే రానా.. ఎప్పటికప్పుడు చాలెంజింగ్ రోల్స్ ను సెలెక్ట్ చేసుకుంటూ రాణిస్తున్నాడు. తనకంటూ వైవిధ్యమైన దారిని ఎంచుకుని దూసుకుపోతున్న రానా తెలుగులో చివరిగా రానా నాయుడు వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించిన సంతి తెలిసిందే.
ఈ క్రమంలో తన నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండనుఏదనే ప్రశ్న నెటింట చర్చనీయాంశంగా మారింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రానా మరోసారి ప్రయోగం చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే ఓ కొత్త డైరెక్టర్ సినిమాలో నటించేందుకు రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఇప్పటికే రానా తేజ డైరెక్షన్లో రాక్షస రాజు సినిమాల్లో చేస్తున్నాడంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కానీ అది ఇప్పటివరకు సెట్స్ పైకి రాలేదు. అలాగే గుణశేఖర్ డైరెక్షన్లో హిరణ్య కాశ్యప అనే పౌరాణిక సినిమాలోని ఈయన నటిస్తున్నాడని వార్తలు వినిపించాయి.. కానీ అది కూడా ఇప్పుడు హోల్డ్ లోనే ఉంది.
అయితే ఈ రెండు సినిమాల్లో సెట్స్ పైకి ముందు ఏ సినిమా వస్తుందో అనే సందేహంలో ఉన్న ఫాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటివరకు దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఎవరి ఆలోచనలకు అందని విధంగా ఓ కొత్త డైరెక్టర్ కథకు రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుకానుందట. ఆర్కే మీడియా వర్క్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారని.. ఈ మూవీలో హీరోయిన్గా కేజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి ని సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన త్వరలోనే రానుందని టాక్.